News March 29, 2024
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించాలంటూ మరో పిల్
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవిలో కొనసాగడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆయనను సీఎంగా తొలగించాలంటూ హిందూసేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిల్ వేశారు. త్వరలో దీనిపై విచారణ జరగనుంది. అయితే నిన్న ఈ తరహా పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేజ్రీవాల్ను సీఎంగా తొలగించలేమంటూ తీర్పిచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.
Similar News
News January 25, 2025
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డా: రష్మిక
సినిమాల్లో సక్సెస్ అయ్యేందుకు కుటుంబానికి సమయం కేటాయించడంలో రాజీ పడినట్లు హీరోయిన్ రష్మిక చెప్పారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదన్నారు. కుటుంబమే తన బలమని, ముఖ్యమైన సమయాల్లో ఫ్యామిలీతోనే గడుపుతానని పేర్కొన్నారు. షూటింగ్స్ వల్ల తనకు ఇష్టమైన చెల్లిని మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. కాగా, ఆమె నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.
News January 25, 2025
VSR రాజీనామాకు ఆమోదం.. బులెటిన్ రిలీజ్
AP: రాజ్యసభ ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి చేసిన రాజీనామాను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. VSR రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ ఏర్పడింది. కాగా రాజకీయాలకు పూర్తిగా దూరమవుతున్నట్లు నిన్న విజయసాయి ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 25, 2025
రోహిత్కు గాయమైతే భారత్కు సమస్యే: అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడితే భారత జట్టు కష్టాల్లో పడుతుందని మాజీ క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ గాయపడితే వైస్ కెప్టెన్గా ఎంపికైన గిల్ కెప్టెన్సీ చేయాలి. కానీ అతడికి అనుభవం లేదు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. రోహిత్, కోహ్లీ, బుమ్రా లేకపోతే టీమ్ని నడిపించే వాళ్లెవరూ కనిపించడం లేదు. టీమ్ ఇండియాలో సమర్థమైన కెప్టెన్ల కొరత ఉంది’ అని తన యూట్యూబ్ వీడియోలో వివరించారు.