News March 25, 2024

వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్

image

వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్ రానుంది. దీనితో యూజర్లు తమ అవతార్‌ను ఇతరులెవరూ స్టిక్కర్స్‌లో వాడకుండా నియంత్రించవచ్చు. ఎవరెవరు మన అవతార్‌ని వాడుకోవచ్చో నిర్ణయించుకునే వెసులుబాటు యూజర్లకు ఉంటుంది. ఇందులో మై కాంటాక్ట్స్, సెలెక్టెడ్ కాంటాక్ట్స్, Nobody అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి మనం ఎంచుకోవచ్చు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Similar News

News February 3, 2026

పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>AP: <<>>పల్నాడు DHMOలో 18 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, డిప్లొమా/MD/PSM, డిగ్రీ, PG, MBA/PGD, BCom, BSc(సైన్స్), DMLT, శానిటరీ ఇన్‌స్పెక్టర్స్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, BCలకు రూ.300. వెబ్‌సైట్: https://palnadu.ap.gov.in

News February 3, 2026

రూ.20 వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

image

వెండి ధరల పతనం కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.2,80,000 పలుకుతోంది. కాగా 4 రోజుల్లోనే వెండి ధర రూ.1.25 లక్షలు తగ్గింది. ఇది ఇన్వెస్టర్లకు బ్యాడ్ న్యూసే అయినా.. శుభకార్యాల ముందు <<19036596>>బంగారం<<>>, వెండి ధరలు పడిపోవడం సామాన్యుడికి శుభవార్తే.

News February 3, 2026

‘CM బ్రేక్‌ ఫాస్ట్‌’కు రూ.500కోట్ల ప్రపోజల్స్

image

TG: చీఫ్ మినిస్టర్ బ్రేక్‌‌ఫాస్ట్‌ స్కీమ్‌కు రూ.500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రపోజల్స్ పంపించింది. మిడ్ డే మీల్స్ కోసం రూ.600 కోట్లు ఇవ్వాలని కోరింది. గతేడాది రూ.530 కోట్లు ఖర్చయిందని, గుడ్ల ధరలు పెరిగినందున ఎస్టిమేషన్స్ పెంచుతూ అధికారులు ప్రపోజల్స్ రెడీ చేసి పంపించారు. రాష్ట్రంలోని దాదాపు 28వేల స్కూల్స్‌లో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.