News March 23, 2025
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

టీ20 ఫార్మాట్లో 400 మ్యాచులు ఆడిన మూడో భారత ప్లేయర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. KKRతో జరిగిన మ్యాచుతో ఈ ఘనత అందుకున్నారు. అతనికంటే ముందు రోహిత్ శర్మ(448), దినేశ్ కార్తీక్ (412) ఈ ఫీట్ సాధించారు. కాగా టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన లిస్టులో కోహ్లీ (12,945) ఐదో స్థానంలో ఉన్నారు. గేల్ (14,562), హేల్స్ (13,610), షోయబ్ (13,537), పొలార్డ్ (13,537) తొలి 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.
Similar News
News April 24, 2025
మాజీ మంత్రి విడదల రజినీ మరిది అరెస్ట్

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినీతో పాటు గోపీపై కేసు నమోదైంది. ఈక్రమంలోనే అతడిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
News April 24, 2025
వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు: పాలస్తీనా అధ్యక్షుడు

పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ హమాస్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయుధాలను, ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలని హుకుం జారీ చేశారు. ‘హమాస్ కుక్కల్లారా.. బందీలను వెంటనే విడిచిపెట్టండి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధం ఆగాలి. బందీల కోసమంటూ ఆ దేశం నరకం సృష్టిస్తోంది. వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు’ అని సూచించారు. కాగా హమాస్పై పాలస్తీనా నుంచి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడం ఇదే తొలిసారి.
News April 24, 2025
ఉగ్రదాడి.. 11 మందిని కాపాడిన కశ్మీరీ వ్యాపారి

J&K ఉగ్రదాడి నుంచి 4 కుటుంబాలకు చెందిన 11 మందిని కశ్మీరీ దుస్తుల వ్యాపారి నజకత్ అలీ కాపాడారు. ఛత్తీస్గఢ్కు చెందిన వీరు ఇటీవల పహల్గామ్ వెళ్లారు. పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఉండగా కాల్పులు జరిగాయి. అక్కడే ఉన్న నజకత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయన వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని శివాంశ్ జైన్, అరవింద్ అగర్వాల్, హ్యాపీ వధావన్, కుల్దీప్ స్థాపక్ వెల్లడించారు.