News June 20, 2024

మరో పథకం పేరు మార్పు

image

AP: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ‘ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్’ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జగనన్న విద్యాదీవెన పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా, YSR కల్యాణమస్తుని చంద్రన్న పెళ్లి కానుకగా, YSR విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న విదేశీ విద్యాదీవెనను అంబేడ్కర్ ఓవర్సీన్ విద్యా నిధిగా ప్రభుత్వం మార్చింది.

Similar News

News November 24, 2025

ఇది సరిగా ఉంటే ఆరోగ్యం మీ వెంటే..

image

మనిషి జీవనశైలిని నియంత్రించేది జీవ గడియారం. అంటే బయోలాజికల్ క్లాక్. రోజువారీ జీవితంలో నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, జీవరసాయన ప్రక్రియలు సమయానికి జరిగేలా చూస్తుంది. అయితే దీంట్లో సమతుల్యత లోపిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. శారీరకంగా, మానసికంగా క్రమంగా శక్తిహీనులుగా మారిపోతుంటే అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News November 24, 2025

భారీగా పెరిగిన కూరగాయల ధరలు!

image

TG: కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లు, వారాంతపు సంతల్లో ఏ కూరగాయ అయినా కేజీ రూ.80 నుంచి రూ.120 పలుకుతోంది. తోటకూర కిలో రూ.90 వరకు అమ్ముతుండగా, పాలకూర రేటు రూ.160కి చేరింది. బీర, బెండ, కాకర, క్యాప్సికం, చిక్కుడు, వంకాయ రేట్లు గత 2 నెలలతో పోలిస్తే డబుల్ అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో పంట నష్టం, దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News November 24, 2025

నేటి నుంచి ‘రైతన్నా.. మీకోసం’

image

AP: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నేటి నుంచి వారం పాటు ‘రైతన్నా.. మీకోసం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా CM CBNతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్తారు. రైతుల కోసం ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయబోతోంది? అనేది వివరిస్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, ఫుడ్ ప్రాసెసింగ్‌పై అవగాహన కల్పిస్తారు.