News January 5, 2025

ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: TDP

image

AP: ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ 43 లక్షల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి రూ.2,500 వరకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది.

Similar News

News December 27, 2025

కృష్ణా జిల్లాలో 60 పోస్టులకు నోటిఫికేషన్

image

AP: హెల్త్ మెడికల్&ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ కృష్ణా జిల్లాలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, MLT, BSc(MLT), ఇంటర్ ఒకేషనల్ (MLT, ఫార్మసీ), DMLT, డిప్లొమా, బీఫార్మసీ, PGDCA, డిగ్రీ(కంప్యూటర్స్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/

News December 27, 2025

సాగులో భూసార పరీక్షలు కీలకం.. నిర్లక్ష్యం వద్దు

image

భూమిలో ఏ పంటలు వేయాలి, ఏ మందులు ఎంత మోతాదులో వేయాలో తెలియక రైతులు అధికమొత్తంలో రసాయన ఎరువులను వాడుతున్నారు. ఇది సాగుభూమికి శాపంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా భూసార పరీక్ష, నీటి పరీక్ష, అవసరమైతే పత్ర విశ్లేషణ పరీక్షలు చేయించాలి. వీటి వల్ల నేల, నీరు, ఆకులు, మొక్కల్లో ఏ పోషకాలున్నాయి, పంటలకు ఏ ఎరువులు ఎంత వేయాలనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. ఎరువుల వాడకంలో సమతుల్యత పాటిస్తే భూమి సారవంతమవుతుంది.

News December 27, 2025

అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవట్లేదే?

image

క్రికెట్‌లో భారత్ అనగానే ఒంటికాలి మీద వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. మన పిచ్‌ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని నోటికొచ్చిన మాటలన్నారు. అలాంటి వాళ్లు AUS పిచ్‌లపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో NOV 21న పెర్త్‌లో తొలి టెస్ట్, ఇవాళ మెల్‌బోర్న్‌లో 4వ మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగిశాయి. మన పిచ్‌లను క్రికెట్‌కు ప్రమాదంగా అభివర్ణించినవాళ్లు ఇప్పుడు మూగబోవడం వింతగా ఉంది.