News January 5, 2025

ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: TDP

image

AP: ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ 43 లక్షల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి రూ.2,500 వరకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది.

Similar News

News December 15, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

⋆ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా 2026, ఫిబ్రవరి 13న విడుదల
⋆ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా టీజర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీమ్
⋆ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదల వాయిదా.. ఈ నెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ చేసిన టీమ్

News December 15, 2025

BC రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు: మహేశ్ గౌడ్

image

TG: బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చకుండా కేంద్రం తొక్కిపెడుతోందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ‘దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆగలేదు. పోరాటానికి అన్ని పార్టీలు కలసిరావాలి. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టాలని CM రేవంత్ రాహుల్ గాంధీని కోరారు. BJP ఎన్నిరోజులు ఆపాలనుకున్నా అది సాధ్యం కాదు. బిల్లు సాకారమయ్యే రోజు ఎంతో దూరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

News December 15, 2025

మాంసాహారం తిని గుడికి వెళ్లవచ్చా?

image

మాంసం తిని గుడికి వెళ్లడం శ్రేయస్కరం కాదని పండితులు చెబుతున్నారు. అందులో ఉండే తమో, రజో గుణాలు మనలో నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తాయని, తద్వారా పూజా ఫలితం దక్కదని అంటున్నారు. అందుకే గుడికి వెళ్లేటప్పుడు, దైవ కార్యాలు చేసేటప్పుడు కనీసం గుడ్లు కూడా ముట్టుకోవద్దంటున్నారు. అయితే సంపూర్ణ పూజా ఫలం దక్కాలంటే.. ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు లేని ఆహారాన్నే స్వీకరించాలని సూచిస్తున్నారు.