News January 5, 2025

ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: TDP

image

AP: ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ 43 లక్షల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి రూ.2,500 వరకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది.

Similar News

News December 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 103 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: ఇతనికి తల, మెడ ఉండవు. కడుపు భాగంలోనే నోరు ఉంటుంది. చేతులు మాత్రం మైళ్ల దూరం వరకు సాగుతాయి. ఎవరతను?
సమాధానం: రామాయణంలోని అరణ్యకాండలో ఈ వింతైన పాత్ర కనిపిస్తుంది. అతని పేరు ‘కబంధుడు’. ఓ శాపం వల్ల ఈ రూపం పొందుతాడు. రాముడు ఇతని బాహువులను ఖండించడంతో శాపవిమోచనం కలిగి, తిరిగి గంధర్వ రూపాన్ని పొందుతాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమని రాముడికి సలహా ఇస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>

News December 21, 2025

బీజేపీకి భారీగా విరాళాలు

image

2024-25లో రాజకీయ పార్టీలకు ₹3,811 కోట్ల డొనేషన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 9 ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా ఇవి అందాయి. బీజేపీకి ఏకంగా ₹3,112 కోట్లు (82%) రావడం గమనార్హం. కాంగ్రెస్‌కు ₹299 కోట్లు(8%), ఇతర పార్టీలకు ₹400 కోట్లు (10%) వచ్చాయి. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలివ్వడాన్ని సుప్రీంకోర్టు గతేడాది రద్దు చేసిన విషయం తెలిసిందే. 2023-24లో ₹1,218 కోట్ల విరాళాలు వచ్చాయి.

News December 21, 2025

20 రోజుల్లో మూడు సభలు నిర్వహించనున్న BRS

image

TG: రాబోయే 20 రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో మూడు సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. తొలుత మహబూబ్ నగర్(పాలమూరు) ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండలో సభలు నిర్వహించాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల సాధనకై పోరు చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.