News January 5, 2025

ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: TDP

image

AP: ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ 43 లక్షల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి రూ.2,500 వరకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది.

Similar News

News December 10, 2025

ఈ నెల 12న ఆన్‌లైన్ జాబ్ మేళా

image

AP: పార్వతీపురం మన్యంలో ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 4 కంపెనీలు ఇంటర్వ్యూ ద్వారా 160 పోస్టులను భర్తీ చేయనున్నాయి. 18 ఏళ్లు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8

News December 10, 2025

తిరుమలలో మరో స్కాం.. స్పందించిన పవన్

image

AP: తిరుమలలో పట్టువస్త్రాల <<18519051>>స్కాంపై<<>> Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. కూటమి ప్రభుత్వ చర్యలతోనే టీటీడీలో జరుగుతున్న అక్రమాలన్నీ బయటపడుతున్నట్లు చెప్పారు. హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పరకామణి విషయంలోనూ జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన మతంలోనూ ఇలాగే జరిగి ఉంటే చిన్న విషయమేనని కొట్టిపారేసేవారా అని ప్రశ్నించారు.

News December 10, 2025

ఐబీపీఎస్ SO, PO ఫలితాలు విడుదల

image

IBPS నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) మెయిన్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు <>ibps<<>> వెబ్‌సైట్లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇందులో పాసైన వారు ఇంటర్వ్యూ రౌండ్‌కు అర్హత సాధిస్తారు. 1,007 ఉద్యోగాలకు గత నెల 9న పరీక్ష జరిగింది. అటు ibps ప్రొబెషనరీ ఆఫీసర్(PO) మెయిన్స్ స్కోర్ కార్డులు కూడా విడుదలయ్యాయి.