News January 6, 2025
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు మరో షాక్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736160533475_1226-normal-WIFI.webp)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’కు తమిళనాడులో మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు నిర్వహించదలచిన ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రాష్ట్రంలో <<15078900>>సినిమా రిలీజ్<<>> కూడా చేయొద్దని లైకా ప్రొడక్షన్స్ సూచించినట్లు తెలిపాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘ఇండియన్-2’ ఫ్లాప్ కావడంతో ఈ మూవీపైనే శంకర్ ఆశలు పెట్టుకున్నారు.
Similar News
News January 21, 2025
రిజిస్టర్డ్ పార్టీకి, రికగ్నైజ్డ్ పార్టీకి తేడా ఇదే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737454946464_1032-normal-WIFI.webp)
అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేసిన పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా ఈసీ పరిగణిస్తుంది. ఇలాంటి పార్టీలకు ఎలాంటి ప్రయోజనాలు అందవు. వీరికి ఓ తాత్కాలిక గుర్తును కేటాయిస్తారు. అలాగే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లను పొందితే దానిని <<15218607>>గుర్తింపు పొందిన<<>> రాజకీయ పార్టీగా ఈసీ గుర్తిస్తుంది. ఈ పార్టీలకు గుర్తుతోపాటు కొన్ని ప్రత్యేకాధికారాలను ఈసీ కేటాయిస్తుంది.
News January 21, 2025
అందుకే పనిష్మెంట్ ఇచ్చా: ఈటల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737475736942_367-normal-WIFI.webp)
TG: తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చేయి ఎత్తలేదని, బూతులు తిట్టలేదని బీజేపీ MP ఈటల రాజేందర్ అన్నారు. కానీ పేదల భూములు కబ్జా అవుతున్నాయనే ఆవేదనతో, ధర్మాన్ని కాపాడేందుకు <<15213239>>ఇవాళ పనిష్మెంట్<<>> ఇచ్చానని చెప్పారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి స్వయంగా చర్యలు తీసుకుని, ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్ చేశారు.
News January 21, 2025
BIG BREAKING: జనసేనకు ఈసీ గుర్తింపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737475479670_367-normal-WIFI.webp)
జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్కు లేఖ పంపింది. ఇంతకాలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన.. గుర్తింపు పొందిన పార్టీగా మారడంతో ఆ గుర్తును ఇకపై ఎవరికీ కేటాయించరు. 2014లో ఆవిర్భవించిన జనసేన ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో రాజోలు ఎమ్మెల్యే సీటు గెలిచింది. 2024లో పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సొంతం చేసుకుంది.