News October 8, 2024
రాష్ట్రంలో మరో ఘోరం.. బాలికకు మద్యం తాగించి

AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ బాలిక(16)పై అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది. నడుచుకుంటూ వెళ్తున్న బాలికను ఆటోలో వచ్చిన ఒక వ్యక్తి, మరో మహిళ కాగితం చూపించి అడ్రస్ అడిగారు. మత్తు మందు స్ర్పే చేసి పట్టణ శివారుకు తీసుకెళ్లి బాలికకు బలవంతంగా మద్యం తాగించి ఆ వ్యక్తి అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితిలోని బాలికను మళ్లీ ఆటో ఎక్కిస్తుండగా చెత్త ఏరుకునే మహిళ చూసి అనుమానించింది. దీంతో వ్యవహారం బయటపడింది.
Similar News
News December 16, 2025
స్పిన్నర్కు భారీ ధర

లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ జాక్పాట్ కొట్టారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్తో ఆక్షన్లోకి వచ్చిన ఆయన్ను రూ.7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇక ఫిన్ అలెన్(రూ.2 కోట్లు)ను కేకేఆర్, జేకబ్ డఫ్ఫీ(రూ.2 కోట్లు)ని ఆర్సీబీ, అకేల్ హోసేన్(రూ.2 కోట్లు)ను సీఎస్కే కొనుగోలు చేశాయి. ఇక అభినవ్ మనోహర్, తీక్షణ, మ్యాట్ హెన్రీ, జెమీ స్మిత్, గుర్బాజ్ అన్సోల్డ్గా మిగిలారు.
News December 16, 2025
పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదు: కేటీఆర్

TG: పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదని, అది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సొంత ఇళ్లు అమ్మి కాంగ్రెస్ నేతలు నిధులివ్వడం లేదని ఫైరయ్యారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను చంపేస్తామని బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లను తెలంగాణ భవన్లో ఇవాళ కేటీఆర్ సన్మానించారు.
News December 16, 2025
MAIDSలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని <


