News September 11, 2024

విశాఖకు మరో వందేభారత్

image

విశాఖ నుంచి ఇప్పటికే మూడు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా SEP 15 నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి దుర్గ్(ఛత్తీస్‌గఢ్)కు గురువారాలు మినహా ప్రతిరోజు ఈ సర్వీస్ నడుస్తుంది. ఉ.6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి రాయ్‌పూర్, మహాసముంద్, రాయగడ, విజయనగరం మీదుగా మ.1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మ.2.55 గం.కు బయల్దేరి రా.10.50 గం.కు దుర్గ్ చేరుకుంటుంది.

Similar News

News January 26, 2026

నలుగురు మంత్రుల అత్యవసర భేటీ?

image

TG: ఓవైపు సీఎం రేవంత్ అమెరికాలో ఉండటం, మరోవైపు సింగరేణిపై రచ్చ కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజాభవన్‌లో నలుగురు మంత్రులు అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. లోక్‌భవన్‌లో ఎట్ హోం ముగిశాక భట్టి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌, అడ్లూరి ఒకే కారులో ప్రజాభవన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

News January 26, 2026

రేపు అఖిలపక్ష భేటీ

image

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆహ్వానం పంపారు. పార్లమెంట్ సమావేశాల్లో సహకరించాలని కేంద్రం కోరనుంది. అలాగే ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను విపక్షాలకు ఇవ్వనుంది. కాగా ఈ నెల 28 నుంచి FEB 13 వరకు, MAR 9 నుంచి APR 2 వరకు రెండు విడతల్లో సమావేశాలు జరగనున్నాయి.

News January 26, 2026

5 సెకన్లలో 10 బుల్లెట్లు.. USను కుదిపేస్తున్న అలెక్స్ మరణం!

image

USలో ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో అలెక్స్ ప్రెట్టీ అనే వ్యక్తి మరణించడం దుమారం రేపుతోంది. ఇమిగ్రేషన్ అధికారుల దౌర్జన్యాన్ని ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నందుకే అతడిపై 5 సెకన్లలో 10 బుల్లెట్లు పేల్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. అతడి వద్ద గన్ ఉందని అధికారులు వాదిస్తున్నా వీడియోల్లో మాత్రం ఫోన్ మాత్రమే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ట్రంప్ హయాంలోని ఏజెంట్ల దాష్టీకాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.