News December 9, 2024

రూపం ఏదైనా తెలంగాణ తల్లి ప్రతిరూపమే: విజయశాంతి

image

TG: రూపం ఏదైనా బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం మనకు ప్రతినిత్యం ప్రాతఃస్మరణీయమని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. అమ్మోరు తల్లి లెక్క నూరు రూపాలైనా, ఏ రూపంలో ఉన్నా మన తెలంగాణ తల్లి ప్రతిరూపమే అని చెప్పారు. నిర్బంధాలను దాటుకొని 2007లో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అయిందన్నారు. ఆ తర్వాత BRS, ఇప్పుడు కాంగ్రెస్ ఆవిష్కరిస్తున్న విగ్రహం తెలంగాణ తల్లి ప్రతిరూపమే అన్నారు.

Similar News

News January 22, 2025

పోలీసులకు సవాల్ విసురుతున్న అఫ్జల్‌గంజ్ కాల్పుల దొంగలు

image

కర్ణాటకలోని బీదర్‌, HYDలోని అఫ్జల్‌గంజ్‌లో <<15172705>>కాల్పులు<<>> జరిపిన దుండగులు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆ రోజు రాత్రి ఇద్దరు దొంగలు తిరుమలగిరి నుంచి శామీర్‌పేట్ వరకు ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ తర్వాత మరో షేర్ ఆటోలో గజ్వేల్‌కు, లారీలో ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌ మీదుగా బిహార్ వెళ్లారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

News January 22, 2025

టీమ్ఇండియా జెర్సీపై పాక్ పేరు.. ICC వార్నింగ్!

image

టీమ్ఇండియా జెర్సీలపై హోస్ట్‌నేమ్ పాకిస్థాన్‌ను ముద్రించకుండా ఉండేందుకు ICC అనుమతించలేదని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. జెర్సీలపై టోర్నీ లోగోలను ముద్రించడం టీమ్స్ బాధ్యతని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. BCCI రిక్వెస్ట్‌ను తిరస్కరించిందని, ఒకవేళ హోస్ట్‌నేమ్ ముద్రించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

News January 22, 2025

బిల్‌గేట్స్‌తో భేటీ కానున్న చంద్రబాబు

image

AP: దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. అనంతరం యూనిలీవర్, డీపీ వరల్డ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతో సీఎం భేటీ అవుతారు.