News January 23, 2025
‘ఏమైనా సరే.. FEB 20లోపు డెలివరీ చేయండి’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన <<15211801>>కొత్త రూల్<<>>తో అక్కడి ఇండోఅమెరికన్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 20లోపు జన్మించే పిల్లలకు మాత్రమే అక్కడి పౌరసత్వం లభించనుంది. దీంతో ఇప్పటికే గర్భంతో ఉన్నవారు ఫిబ్రవరి 20లోపు డెలివరీ జరిగేలా వైద్యులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. నెలలు నిండకుండానే సి-సెక్షన్లు చేయాల్సిందిగా వైద్యులకు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.
Similar News
News February 19, 2025
నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

TG: నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్ కింది భాగంలో మంటలు చెలరేగాయి. దాదాపు 120 ఎకరాల్లో మంటలు ఎగసిపడుతున్నట్లు సమాచారం. నాగార్జునపేట తండా, జమ్మనకోట తండా, మూలతండా వరకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రధాన డ్యామ్కు కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
News February 19, 2025
సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్మెంట్: లోకేశ్

AP: ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుటపడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు. తాను జగన్పై చేసిన పోరాటం కంటే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం 3రెట్లు అధికంగా చంద్రబాబుగారితో పోరాడుతున్నానని లోకేశ్ సరదాగా అన్నారు.
News February 19, 2025
కొత్త సీఎంకు మా మద్దతు ఉంటుంది: కేజ్రీవాల్

ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తాకు మాజీ సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్, ఆతిశీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీల వల్లే ఈ అధికారం వచ్చిందని, ఆ హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కొత్త సీఎంకు ప్రతి పనిలో అవసరమైన మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.