News December 13, 2024
టూరిస్ట్ డెస్టినేషన్గా ఏపీ: పవన్ కళ్యాణ్

AP: రాష్ట్రాన్ని టూరిస్ట్ డెస్టినేషన్గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలో రాష్ట్రం దూసుకెళ్తుంది. గోవా వంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్లు నాశనమయ్యాయి. మన రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు
Similar News
News November 27, 2025
ఏపీఎం, ఇన్ఛార్జ్కు షోకాజ్ నోటీసులు ఇవ్వండి: హనుమకొండ కలెక్టర్

శాయంపేట మండలం పత్తిపాక కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేయకూడదని అధికారులను ఆదేశించారు. రైతుల వివరాలను ట్యాబ్లో వెంటనే నమోదు చేయకపోవడంపై ఏపీఎం, కేంద్రం ఇన్ఛార్జ్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు టెంట్, తాగునీరు సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
News November 27, 2025
భాస్వరం, నత్రజని ఎరువులను ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం?

పంట నాటిన/విత్తిన రెండు వారాలలోపే మొత్తం భాస్వరం ఎరువులను పంటలకు వేయాలి. పైపాటుగా వాడకూడదు. నత్రజని, పొటాష్ ఎరువులను పూతదశకు ముందే వేసుకోవాలి. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా మూడు దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. సూక్ష్మపోషక ఎరువులను పంటకు స్ప్రే రూపంలో అందించాలి.
News November 27, 2025
అటు అనుమతి, ఇటు విరాళం.. టాటా గ్రూపుపై సంచలన ఆరోపణలు!

BJPకి టాటా గ్రూపు లంచం ఇచ్చిందంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూపు, BJPపై scroll.in రాసిన కథనాన్ని షేర్ చేశారు. ‘సెమీకండక్టర్ యూనిట్లకు మోదీ క్యాబినెట్ ఆమోదం తెలపగానే BJPకి అతిపెద్ద దాతగా టాటా గ్రూపు ఎలా మారింది? 2 యూనిట్లకు సబ్సిడీ కింద ₹44,203Cr టాటాకు వస్తాయి. క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన 4 వారాలకు ₹758Crను BJPకి విరాళంగా ఇచ్చింది. ఇది లంచం’ అని ట్వీట్ చేశారు.


