News December 13, 2024
టూరిస్ట్ డెస్టినేషన్గా ఏపీ: పవన్ కళ్యాణ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733902956771_1032-normal-WIFI.webp)
AP: రాష్ట్రాన్ని టూరిస్ట్ డెస్టినేషన్గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలో రాష్ట్రం దూసుకెళ్తుంది. గోవా వంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్లు నాశనమయ్యాయి. మన రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు
Similar News
News January 17, 2025
ఉద్యోగులపై పెండింగ్ కేసులు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734721255624_893-normal-WIFI.webp)
AP: ఉద్యోగులపై విజిలెన్స్, శాఖాపరమైన కేసుల దర్యాప్తు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటం సరికాదని Dy.CM పవన్ అన్నారు. దీనివల్ల వారి పని తీరుపై ప్రభావం పడుతుందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న కేసులపై ఆరా తీశారు. 3 వారాల్లో తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా కేసులను పరిష్కరించడంపై దృష్టిసారించాలన్నారు.
News January 17, 2025
సెలవులు ముగిశాయ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737122701997_653-normal-WIFI.webp)
తెలంగాణలోని స్కూళ్లకు నేటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దాదాపు వారం రోజులు పండగ హాలిడేస్ ఎంజాయ్ చేసిన విద్యార్థులు రేపటి నుంచి బడి బాట పట్టనున్నారు. రాబోయే 2, 3 నెలలు పరీక్షాసమయం కావడంతో స్టూడెంట్స్ ఇక పుస్తకాలకే అంకితం కానున్నారు. కాగా ఈనెల 11 నుంచి 17 వరకు ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు జూనియర్ కాలేజీలు ఇవాళ్టి నుంచి పున:ప్రారంభం అయ్యాయి.
News January 17, 2025
రేషన్కార్డుల ఎంపికలో గందరగోళం.. విమర్శలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737120494474_653-normal-WIFI.webp)
TG: రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తమకు అందజేసిన జాబితా ప్రకారం గ్రామాల్లో సిబ్బంది సర్వే చేస్తున్నారు. ప్రజాపాలన సందర్భంగా కార్డు కోసం అప్లై చేసినా జాబితాలో పేరు లేకపోవడం ఏంటని చాలామంది సిబ్బందిని నిలదీస్తున్నారు. అర్హుల ఎంపికకు ప్రభుత్వం దేన్ని ప్రాతిపదికగా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. కులగణన ఆధారంగా సర్కార్ జాబితా రూపొందించినట్లు సమాచారం.