News July 22, 2024

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

image

AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. ఈనెల 26 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 13, 2025

బ్లాస్ట్ చేసిన వారికే కాంగ్రెస్ సపోర్ట్: బీజేపీ

image

ఢిల్లీ బ్లాస్ట్ కారకులకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందని BJP మండిపడింది. ఎన్నికల సమయంలోనే ఉగ్రవాద దాడులు జరగడానికి కారణమేంటని సిద్దరామయ్య ప్రశ్నించడంపై ఫైర్ అయింది. సిద్దరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, వారివి దిగజారుడు రాజకీయాలని BJP కర్ణాటక చీఫ్ విజయేంద్ర మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.

News November 13, 2025

SC, ST యువతకు ఉచితంగా సివిల్స్ కోచింగ్: మంత్రి

image

AP: ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా UPSC సివిల్స్ శిక్షణ ఇస్తామని మంత్రి DBV స్వామి తెలిపారు. రాష్ట్రంలోని 340 మందికి విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లోని అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో ఫ్రీగా ప్రిలిమ్స్ శిక్షణ అందిస్తామన్నారు. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 13 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సైట్ https://apstudycircle.apcfss.in

News November 13, 2025

LSG-MI మధ్య టాక్స్.. ఎక్స్‌ఛేంజ్‌ అయ్యేది వీళ్లే!

image

IPL రిటెన్షన్ గడువు దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల స్వాపింగ్‌ చర్చల్లో వేగం పెంచాయి. RR, CSK మధ్య <<18253766>>కీలక ఆటగాళ్ల<<>> ఎక్స్‌ఛేంజ్‌కు ఇప్పటికే ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. తాజాగా LSG-MI కూడా చెరో ప్లేయర్‌ను మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. LSG నుంచి MIకి శార్దూల్ ఠాకూర్, MI నుంచి LSGకి అర్జున్ టెండూల్కర్ మారతారని cricbuzz తెలిపింది. MIతో శార్దూల్ డీల్ కుదిరినట్లు అశ్విన్ చెప్పడం గమనార్హం.