News August 5, 2024

ప్రధాని మోదీని కలిసిన AP BJP చీఫ్

image

AP BJP చీఫ్ పురందీశ్వరి ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు ఆమె ట్విటర్‌లో తెలిపారు. స్టీల్ ప్లాంట్‌, ఇతర సమస్యలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయనకు వివరించామన్నారు. గత ప్రభుత్వాల దుష్పరిపాలన వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో కూడా చెప్పామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపామని ఆమె పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు ఇస్తాం: మంత్రి తుమ్మల

image

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి రూ.10 లక్షల గ్రాంటు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లోపు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన ప్రతి మహిళకు వద్దకు వెళ్లి, బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరలను అందించాలని సూచించారు.

News November 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 74

image

ఈరోజు ప్రశ్న: వేంకటేశ్వరస్వామి ద్వార పలుకులు అయిన జయవిజయులు తర్వాతి మూడు జన్మలలో అసురులుగా ఎందుకు జన్మించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 22, 2025

26న ‘స్టూడెంట్ అసెంబ్లీ’.. వీక్షించనున్న సీఎం

image

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. ఇందుకోసం 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. కొందరు స్పీకర్, Dy.స్పీకర్, CM, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారు. మిగతా విద్యార్థులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తారు. రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని CM CBN, మంత్రులు వీక్షించనున్నారు.