News August 5, 2024

ప్రధాని మోదీని కలిసిన AP BJP చీఫ్

image

AP BJP చీఫ్ పురందీశ్వరి ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు ఆమె ట్విటర్‌లో తెలిపారు. స్టీల్ ప్లాంట్‌, ఇతర సమస్యలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయనకు వివరించామన్నారు. గత ప్రభుత్వాల దుష్పరిపాలన వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో కూడా చెప్పామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపామని ఆమె పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

దయనీయ స్థితిలో పావలా శ్యామల.. ఆత్మహత్యకు యత్నిస్తూ!

image

ప్రముఖ నటి పావలా శ్యామల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆదుకునేవారే లేకపోవడంతో ఆమె జీవనం అగమ్యగోచరంగా మారింది. దీంతో మంచానికే పరిమితమైన తల్లీకూతుళ్లను హోమ్ నిర్వాహకులు బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. రోడ్డుపై దయనీయస్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వీరిని పోలీసులు గుర్తించి ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. దీనిపై సినీ పెద్దలు ఎవరూ స్పందించలేదు.

News December 11, 2025

‘అలాంటి వరి రకాల సాగును ప్రోత్సహించాలి’

image

ప్రజలు ఎక్కువగా ఆహారంగా తీసుకునే వరి రకాల సాగును ప్రోత్సహించడంతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయంగా ఎగుమతికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఉల్లి కొనుగోలు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. సుబాబుల్ రైతులకు మంచి ధర దక్కేలా చూడాలన్నారు. అరటి, నిమ్మ, ఇతర ఉద్యానపంటల కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు.

News December 11, 2025

తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేటు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.