News October 10, 2024
రతన్ టాటాకు ఏపీ క్యాబినెట్ సంతాపం
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఏపీ క్యాబినెట్ సంతాపం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం మౌనం పాటించి రతన్ టాటాకు నివాళి అర్పించింది. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం కొనియాడారు. అనంతరం క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు, లోకేశ్ ముంబై వెళ్లి రతన్ టాటా భౌతికకాయానికి నివాళి అర్పించనున్నారు.
Similar News
News October 10, 2024
హరియాణా ఫలితాలపై ECకి కాంగ్రెస్ ఫిర్యాదు
హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కొన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 20 సెగ్మెంట్ల ఫలితాలపై అనుమానం ఉందని సంబంధిత ఆధారాలను ఈసీకి సమర్పించామని తెలిపింది. మరో 13 సెగ్మెంట్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నట్లు తెలిపింది.
News October 10, 2024
కాసేపట్లో వర్షం
TGలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. యాదాద్రి, వరంగల్, సూర్యాపేట, సిద్దిపేట, సిరిసిల్ల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, MBNR, మెదక్, కరీంనగర్, కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, వనపర్తి, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇప్పటికే HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
News October 10, 2024
రతన్ టాటా వారసుడు ఎవరు?
రతన్ టాటా మరణంతో ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. రతన్కు పిల్లలు లేకపోవడంతో ట్రస్ట్లో వాటా ఎవరికి దక్కుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన సవతితల్లి కుమారుడు నోయెల్ టాటా పిల్లలు మాయ, నెవిల్లే, లేహ్ అందుకు అర్హులనే చర్చ నడుస్తోంది. వీరంతా ప్రస్తుతం టాటా సంస్థలోనే వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరే టాటా సామ్రాజ్యానికి కాబోయే అధిపతులని విశ్లేషకులు భావిస్తున్నారు.