News October 10, 2024
రతన్ టాటాకు ఏపీ క్యాబినెట్ సంతాపం

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఏపీ క్యాబినెట్ సంతాపం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం మౌనం పాటించి రతన్ టాటాకు నివాళి అర్పించింది. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం కొనియాడారు. అనంతరం క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు, లోకేశ్ ముంబై వెళ్లి రతన్ టాటా భౌతికకాయానికి నివాళి అర్పించనున్నారు.
Similar News
News December 8, 2025
ఇంటి చిట్కాలు మీ కోసం..

* నిమ్మచెక్కతో మైక్రోవేవ్ పైభాగాన్ని శుభ్రం చేస్తే మచ్చలు త్వరగా పోతాయి.
* స్టెయిన్ లెస్ స్టీలుకు బేబీ ఆయిల్ రాస్తే గీతలు పడకుండా దృఢంగా ఉండడమే కాదు కొత్తదానిలా తళతళలాడుతుంది.
* ఫ్రిజ్లో తరిగిన నిమ్మకాయ ముక్క పెడితే సువాసనలు వెదజల్లుతుంది.
* ఇంట్లోని సింకు బ్లాక్ అయితే సోడియం బైకార్బొనేట్తో పాటు ఒక బాటిల్ వైట్ వెనిగర్ ని కూడా వేస్తే నీళ్లు సింకులోంచి వేగంగా పోతాయి.
News December 8, 2025
2026లోనూ బంగారం ధరల పెరుగుదల: గోల్డ్ కౌన్సిల్

బంగారం ధరల పెరుగుదల వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా పసిడికి డిమాండ్ కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. సెంట్రల్ బ్యాంకులు భారీగా కొంటుండటం, గోల్డ్ రీసైక్లింగ్ యాక్టివిటీలు, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం ఇందుకు కారణమని చెప్పింది. ఈ ఏడాది నవంబర్ వరకు బంగారం 60% పెరుగుదల కనబరిచిన విషయం తెలిసిందే.
News December 8, 2025
టెన్త్ అర్హతతో 25,487పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<


