News November 9, 2024
ఈనెల 11న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: ఈనెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అదే రోజున ఉ.9 గంటలకు భేటీ కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. క్యాబినెట్ ఆమోదించిన అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
Similar News
News January 28, 2026
బాబాయ్తో విభేదించి.. పార్టీని చీల్చి..

తన బాబాయ్, NCP అధినేత శరద్ పవార్ నిర్ణయానికి వ్యతిరేకంగా 2019 NOVలో అజిత్ పవార్ BJPతో కలిశారు. ఫడణవీస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, Dy.CMగా ప్రమాణం చేశారు. కానీ వారానికే సొంతగూటికి చేరారు. 2023 జులైలో మరోసారి తన వర్గంతో వెళ్లి BJPతో పొత్తు పెట్టుకున్నారు. కుటుంబం, పార్టీ విచ్ఛిన్నానికి ఇది కారణమైంది. మూడేళ్లకు ఇటీవల స్థానిక ఎన్నికల్లో <<18701129>>బాబాయ్, అబ్బాయ్<<>> ఒక్కటయ్యారు. ఇంతలోనే ఘోరం జరిగింది.
News January 28, 2026
వరి చిరు పొట్ట దశలో పొటాష్ వేస్తున్నారా?

వరి సాగులో ఎరువుల యాజమాన్యం ముఖ్యం. సరైన సమయంలో పంటకు అవసరమైన ఎరువులు, పోషకాలు అందించాలి. తెలుగు రాష్ట్రాలలో తేలిక భూములే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వరి చిరు పొట్ట దశలో ఎకరాకు 35 నుంచి 40 కిలోల యూరియాతో పాటు 20 నుంచి 25 కిలోల పొటాష్ ఎరువును వాడటం మంచిది. ఈ దశలో పొటాష్ వాడకం వల్ల వెన్నులో గింజ నాణ్యంగా ఉండి.. తాలు గింజలు ఏర్పడవు. దీని వల్ల అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News January 28, 2026
కుప్పకూలిన విమానం.. కారణమిదే

మహారాష్ట్ర బారామతి ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రన్వే నుంచి పక్కకు వెళ్లి కూలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఫ్లైట్పై పైలట్ పూర్తిగా పట్టుకోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రమాదానికి గురైన Learjet 45 ఎయిర్క్రాఫ్ట్ను VSR సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఈ దుర్ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు <<18980385>>మరణించారు.<<>>


