News November 9, 2024
ఈనెల 11న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: ఈనెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అదే రోజున ఉ.9 గంటలకు భేటీ కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. క్యాబినెట్ ఆమోదించిన అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
Similar News
News February 5, 2026
నారా రోహిత్-అల్లరి నరేశ్ కాంబోలో కామెడీ ఎంటర్టైనర్?

టాలీవుడ్లో మరో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుంది. అల్లరి నరేశ్, నారా రోహిత్ కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నట్లు సమాచారం. నారా రోహిత్తో ‘సుందరకాండ’ తీసిన వెంకటేశ్ నిమ్మలపూడి ఈ చిత్రానికి డైరెక్టర్గా, హరీశ్ పెద్ది నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.
News February 5, 2026
రైతు భరోసా ఇప్పుడే వేయాలి: KTR

TG: రైతు భరోసాను మున్సిపల్ ఎన్నికల తరువాత ఇస్తామని CM రేవంత్ చెప్పడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. ‘KCR DECలోనే ఇచ్చేవారు. డిసెంబర్లో వేయాల్సిన డబ్బులు నేటికీ ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికలయ్యాక ఇస్తామనడం ఏమిటి? మున్సిపల్ ఎన్నికలే కదా? రైతులకు ఇచ్చేదానికి ఎవరు అడ్డం పడ్డారు? ఇప్పుడే ఇవ్వాలి. ఎన్నికలయ్యాక అంటే ఏరు దాటాక బోడిమల్లన్న అంటారు’ అని సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.
News February 5, 2026
మేం వెళ్తున్నాం.. ఫ్లైట్ బుక్ చేశాం: సూర్య

T20 WCలో ఈనెల 15న జరిగే లీగ్ మ్యాచ్ను పాక్ <<19024958>>బాయ్కాట్ చేయడం<<>>పై టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ విషయంలో తమ జట్టు సన్నద్ధతలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ‘మేం స్పష్టంగానే ఉన్నాం. వాళ్ల(పాకిస్థాన్)తో ఆడబోమని మేం చెప్పలేదు. అలా అన్నది వాళ్లే. USA, కెనడాతో మ్యాచ్ల తర్వాత మేం కొలంబో వెళ్తాం. మా ఫ్లైట్ బుక్ అయింది. మేం వెళ్తున్నాం’ అని కెప్టెన్స్ మీట్లో చెప్పారు.


