News January 17, 2025

నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్, పలు రంగాల్లో పెట్టుబడులు, భూముల కేటాయింపులు వంటి అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం చంద్రబాబు తన నివాసంలో టీడీపీ మంత్రులు, ఎంపీలు, జోనల్ ఇంఛార్జ్‌లతో సమావేశం కానున్నారు.

Similar News

News October 14, 2025

పుట్టినప్పుడు 306.. పెరిగాక 206 ఎముకలు!

image

శిశువులు సుమారు 306 ఎముకలతో <<18001798>>పుడితే<<>> యుక్తవయస్సు వచ్చేసరికి అవి 206కి తగ్గుతాయి. మిగిలిన 100 ఎముకలు ఏమయ్యాయనే సందేహం మీకు వచ్చిందా? శిశువులకు మెదడు పెరుగుదల కోసం, ప్రసవ సమయంలో సులభంగా బయటకు వచ్చేందుకు వీలుగా పుర్రెలోని ఎముకలు విడివిడిగా ఉంటాయి. పిల్లలు పెరిగేకొద్దీ ఈ చిన్న ఎముకలు, మృదులాస్థి భాగాలు గట్టిపడి ఒకే పెద్ద ఎముకగా ఏర్పడతాయి. పుర్రె ఎముకలు, వెన్నెముక & కటి ఎముకలు కలిసిపోతాయి.

News October 14, 2025

హర్షిత్ ఎంపికపై విమర్శలు.. గంభీర్ ఆగ్రహం

image

AUSతో సిరీస్‌కు హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై వచ్చిన <<17920712>>విమర్శలపై<<>> కోచ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. ‘యూట్యూబ్ ఛానెల్స్ వ్యూస్ కోసం 23ఏళ్ల పిల్లాడి గురించి ఇలా ప్రచారం చేయకండి. అతడి తండ్రి మాజీ ఛైర్మనో, మాజీ క్రికెటరో, ఎన్నారైనో కాదు. ఇప్పటివరకు సొంతంగా కష్టపడి ఆడిన అతడిని టార్గెట్ చేయడం సరికాదు. భవిష్యత్తులో మీ పిల్లల్ని కూడా ఎవరో ఒకరు టార్గెట్ చేయొచ్చని గుర్తుంచుకోండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

News October 14, 2025

మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు

image

AP: హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై సిట్ రైడ్స్ చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈక్రమంలో మరోసారి సిట్ తనిఖీలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.