News August 5, 2024
ఏపీ వర్చువల్ వర్కింగ్ హబ్గా మారాలి: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రం వర్చువల్ వర్కింగ్ హబ్గా మారాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం ఓ విధానాన్ని రూపొందించాలని, దీనిపై ఓ వర్క్ షాప్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ‘విద్యార్థులకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలను పెంచాలి. గతంలో న్యాక్ అక్రిడేషన్లో ఏపీ వర్సిటీలు టాప్-10లో ఉండేవి. ఇప్పుడు ఒక్కటి కూడా లేకపోవడం శోచనీయం’ అని కలెక్టర్లతో మీటింగ్లో వ్యాఖ్యానించారు.
Similar News
News December 24, 2025
గర్భనిరోధక మాత్ర ఎలా పని చేస్తుందంటే?

ఈ టాబ్లెట్లలో లెవోనోర్జెస్ట్రల్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది సహజంగా లభించే స్త్రీ సెక్స్ హార్మోన్ ప్రొజెస్టెరాన్ సింథటిక్ వెర్షన్. ఓవులేషన్ సమయంలో అండం విడుదల అవుతుంది. అయితే ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడుతుంది. అండం ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడం, ఫలదీకరణాన్ని నిరోధించడం వంటివి చేస్తుంది. అలాగే ఫలదీకరణం అయిన అండం గర్భాశయంలో అమర్చబడకుండా చేసి గర్భధారణను నిరోధిస్తుంది.
News December 24, 2025
శని దోషమా? ఇవి దానం చేయండి..

పుష్య మాసంలో చేసే చిన్న దానమైనా శని దోషాల నుంచి విముక్తి కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. జాతకంలో శని ప్రభావం ఉన్నవారు అన్నదానం, వస్త్రదానం చేయాలంటున్నారు. ‘చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో కంబళ్లు, దుప్పట్లు దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శని దేవుడికి ప్రీతికరమైన ఈ మాసంలో కొన్ని సరళమైన పరిహారాలతో శని బాధలను తగ్గించుకోవచ్చు’ అంటున్నారు. ఆ పరిహారాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News December 24, 2025
విత్తనాలు కొనేటప్పుడు రశీదు కీలకం

విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్ నుంచి కొనుగోలు రశీదు తప్పకుండా తీసుకోవాలి. దీనిపై రైతు మరియు డీలర్ సంతకం తప్పకుండా ఉండాలి. పంటకు విత్తనం వల్ల నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే ఆ రశీదును పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత రాకపోతే నష్టపరిహారానికి రశీదు అవసరం.


