News July 17, 2024
AP మీకు స్వాగతం పలుకుతోంది: కంపెనీలకు లోకేశ్ రిక్వెస్ట్

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో అక్కడి కంపెనీలను ఆకర్షించేందుకు ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ సిద్ధమయ్యారు. NASSCOM చేసిన ట్వీట్కు స్పందిస్తూ వారిని ఏపీకి ఆహ్వానించారు. ‘వైజాగ్లోని మా IT, AI & డేటా సెంటర్ క్లస్టర్కి మీ కంపెనీలను మార్చుకునేందుకు స్వాగతిస్తున్నాం. మీకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. మీకు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 8, 2025
ఇవాళ్టి మ్యాచులకు నో ఎంట్రీ!

HYDలోని ఉప్పల్, జింఖానా మైదానాల్లో SMATలో భాగంగా ఇవాళ 4 మ్యాచులు జరగనున్నాయి. అయితే ప్రేక్షకులను అనుమతించకూడదని HCA నిర్ణయించింది. DEC 2న పంజాబ్, బరోడా మధ్య మ్యాచ్ జరగ్గా హార్దిక్, అభిషేక్ను చూడటానికి భారీగా ఫ్యాన్స్ వచ్చారు. సరైన సెక్యూరిటీ లేక పలువురు గ్రౌండులోకి వెళ్లి ప్లేయర్లతో సెల్ఫీలు సైతం దిగారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత దృష్యా ఆడియన్స్ను అనుమతించకూడదని నిర్ణయించినట్లు HCA తెలిపింది.
News December 8, 2025
రెచ్చగొట్టేలా జైశంకర్ వ్యాఖ్యలు: పాకిస్థాన్

విదేశాంగ మంత్రి జైశంకర్పై పాకిస్థాన్ మండిపడింది. పాక్ ఆర్మీ నుంచే తమకు చాలా <<18486203>>సమస్యలు<<>> వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘ఆయన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాక్ బాధ్యతాయుత దేశం. మా వ్యవస్థలు జాతీయ భద్రతకు మూలం’ అని పాక్ విదేశాంగ శాఖ ఆఫీసు ప్రతినిధి తాహిర్ చెప్పారు. తమపై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవాలనే పాక్ దళాల సంకల్పానికి మేలో జరిగిన ఘర్షణే రుజువు అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు.
News December 8, 2025
ఊల వేసిన మడిలో నీరుంటుందా?

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.


