News July 22, 2024
రైతు బీమాకు దరఖాస్తులు.. ఆగస్టు 5 వరకు గడువు

TG: రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని వారు ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు. 18-59 ఏళ్ల వయసు ఉన్న వారు ఏఈవోలకు అప్లికేషన్లు ఇవ్వాలి. రైతులు పట్టాదార్ పాస్బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్, నామినీ ఆధార్కార్డు జత చేయాలి. జూన్ 28 వరకు పట్టాదారు పాస్బుక్ పొందిన వారూ అర్హులేనని వ్యవసాయ శాఖ పేర్కొంది.
Similar News
News November 27, 2025
కీరదోసలో ఆకుమచ్చ, వెర్రి తెగులు నివారణ

కీరదోసలో ఆకులమచ్చ తెగులు వల్ల ఆకులపై చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి, తర్వాత ఇవి పెద్దగా మారి ఆకు ఎండి రాలిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు వల్ల ఆకులలో ఈనెలు ఉండే ప్రాంతంలో చారలు ఏర్పడి, మొక్క గిడస బారి, పూత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2mlను కలిపి పిచికారీ చేయాలి.
News November 27, 2025
2030లో బంగారం విలువ ఎంత ఉండనుంది?

గత 25 ఏళ్లలో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. 2000లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.4,400 కాగా ఇప్పుడు అది దాదాపు రూ.1,25,000కి చేరింది. సుమారు 14% కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో స్థిరంగా పెరుగుతోంది. ప్రస్తుతం రూ.5 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేస్తే 2030 నాటికి రూ.10 లక్షలు దాటే అవకాశం ఉందని వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు. అయితే పసిడి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి.
News November 27, 2025
ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.


