News July 31, 2024
అమరావతి రైల్వేలైన్ భూసేకరణకు అధికారుల నియామకం

AP: అమరావతి రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.53కి.మీ మేర నిర్మించే ఈ లైన్ భూసేకరణ కోసం అధికారులను రైల్వేశాఖ నియమించింది. గుంటూరు జిల్లా పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో గుంటూరు జేసీ, NTR(D) ఇబ్రహీంపట్నంలో విజయవాడ RDO, కంచికచర్ల, వీరులపాడులో నందిగామ RDO, పల్నాడు(D) అమరావతిలో సత్తెనపల్లి RDOకు భూసేకరణ బాధ్యతలను అప్పగించింది.
Similar News
News November 6, 2025
ఎల్ఐసీ Q2 లాభాలు ₹10,053Cr

FY25 రెండో త్రైమాసిక(Q2) ఫలితాల్లో ఎల్ఐసీ ₹10,053Cr నికర లాభాలను ఆర్జించింది. గతేడాది(₹7,621Cr)తో పోలిస్తే 32 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నాటికి మొత్తం ఆదాయం FY24తో పోలిస్తే ₹2.29L Cr నుంచి ₹2.39L Crకు పెరిగింది. నెట్ ప్రీమియం ఆదాయం ₹1.19L Cr నుంచి ₹1.26L Crకు చేరింది. ఇక సంస్థల ఆస్తుల విలువ 3.31 శాతం వృద్ధితో ₹57.23L Crకు పెరిగింది.
News November 6, 2025
రికార్డులు బద్దలు.. బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బిహారీలు రికార్డులు బద్దలుకొట్టారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్ శాతాన్ని నమోదు చేశారు. ఇవాళ జరిగిన తొలి విడత పోలింగ్లో ఏకంగా 64.66శాతం ఓటింగ్ నమోదైంది. 1998 లోక్సభ ఎన్నికల్లో నమోదైన 64.6శాతమే ఇప్పటివరకు అత్యధికం. గత ఎలక్షన్స్(2020)లో 57.29శాతం పోలింగ్ రికార్డవగా ఈసారి 7శాతానికి పైగా ఎక్కువ ఓట్లు పోలవడం విశేషం.
News November 6, 2025
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ మృతి

ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అనునయ్ సూద్(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఇన్స్టాలో వెల్లడించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. నోయిడాకు చెందిన అనునయ్ దుబాయ్లో ట్రావెల్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. 46 దేశాల్లో పర్యటించిన ఆయనకు ఇన్స్టాలో 14L, యూట్యూబ్లో 3.80L మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022, 23, 24లో ఫోర్బ్స్ ఇండియా టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.


