News September 19, 2024

మూడు జిల్లాలకు YCP అధ్యక్షుల నియామకం

image

AP: మరో మూడు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను నియమించింది. శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్, విజయనగరం-మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం-శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా తమ్మినేని సీతారాం‌ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News September 20, 2024

మాతృత్వంతో ఆనందం, ఆందోళన: అలియా భట్

image

తల్లి అయిన తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్ సాధ్యం కావట్లేదని హీరోయిన్ అలియా భట్ చెప్పారు. తనకంటూ సమయం వెచ్చించలేకపోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మాతృత్వం ఆనందంగానే ఉన్నా ఆందోళన కూడా ఉందన్నారు. కూతురు రాహా అల్లరి, చిలిపి పిల్ల అని మురిసిపోయారు. 2022 నవంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 11న ఇది విడుదల కానుంది.

News September 20, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: స్వాతి కార్తెలో వర్షపు చినుకు ఆలుచిప్పలో పడితే ముత్యం అవుతుంది. అదే వర్షం నీటిలో పడితే అదే నీటిలో కలిసిపోతుంది. అదే విధంగా ఏదైనా దక్కాలనే ప్రాప్తి ఉంటే అదృష్టము ఎక్కడికీ పోదు.

News September 20, 2024

స్టార్ హోటల్ ఎంట్రన్స్‌లోనే మలవిసర్జన.. రూ.25 వేల ఫైన్

image

సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌లో ఓ భారతీయ కార్మికుడు హోటల్ ఎదుటే మలవిసర్జన చేశాడు. దీంతో కోర్టు అతడికి రూ.25 వేల ఫైన్ విధించింది. గతేడాది భారత్‌కు చెందిన రాము చిన్నరాసా అనే కార్మికుడు మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌కు వెళ్లాడు. అక్కడ తప్పతాగి క్యాసినోకు వెళ్లాడు. తర్వాత మద్యం మత్తులో బాత్‌రూమ్‌కు వెళ్లే దారి తెలియక హోటల్ ఎంట్రన్స్‌లోనే మలవిసర్జన చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.