News February 19, 2025

నిన్న నియామకం.. నేడు కోర్టు విచారణ

image

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక నిబంధనల మార్పుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. గతంలో CJI, ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానెల్ CEC, ECలను నియమించేది. ఇందులో నుంచి CJIని తొలగిస్తూ, ఒక కేంద్రమంత్రిని చేరుస్తూ NDA ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారమే జ్ఞానేశ్ కుమార్‌ను CECగా కేంద్రం సోమవారం అర్ధరాత్రి నియమించింది. కేంద్రం తీరును ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.

Similar News

News December 4, 2025

నేడు మార్గశిర పౌర్ణమి.. ఏం చేయాలంటే?

image

మార్గశిర మాసంలో గురువారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. నేడు ఈ వారం పౌర్ణమి తిథితో కలిసి వచ్చింది. కాబట్టి నేడు లక్ష్మీదేవితో పాటు చంద్రున్ని కూడా పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు అంటున్నారు. ఈరోజు లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మీ వైభవం కలుగుతుందని, చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే మానసిక శాంతి లభిస్తుందని చెబుతున్నారు. ☞ ఈ వ్రతాలు ఎలా, ఏ సమయంలో చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 4, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) కోట్‌ద్వారా యూనిట్‌లో 14 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ C పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ITI, అప్రెంటిషిప్ ఉత్తీర్ణులైన, 28ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News December 4, 2025

వ్యర్థాలు తగలబెడితే సాగుకు, రైతుకూ నష్టం

image

సుమారు 80-90 శాతం రైతులు పంటకాలం పూర్తయ్యాక మిగిలిన వరి కొయ్యలను, పత్తి, మిరప, మొక్కజొన్న కట్టెలను పొలంలోనే మంటపెట్టి కాల్చేస్తున్నారు. ఈ సమయంలో విడుదలయ్యే వేడితే భూమి సారాన్ని కోల్పోతుంది. పంట పెరుగుదలకు అవసరమయ్యే సేంద్రియ కర్బనం, నత్రజని, పాస్పరస్‌ లాంటి పోషకాల శాతం తగ్గుతుంది. పంట వ్యర్థాలను తగలబెట్టేటప్పుడు విడుదలయ్యే పొగ వల్ల తీవ్ర వాతావరణ కాలుష్యంతో పాటు రైతుల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది.