News April 25, 2024
ఈ నెల 25న ఏపీఆర్జేసీ, డీసీ సెట్ పరీక్షలు

AP: ఈ నెల 25న APRJC, డీసీసెట్-2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. APRJCకి 32,666 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అలాగే డీసీ సెట్కు 56,949 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి రేపు మ.2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు కనీసం గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
Similar News
News December 15, 2025
24 ఏళ్ల వయసులో రూ.2.50 కోట్ల టర్నోవర్

ఒక స్టార్టప్తో 10 వేల మంది రైతులకు అండగా నిలుస్తున్నారు బిహార్కు చెందిన 24 ఏళ్ల ప్రిన్స్ శుక్లా. రైతుల కష్టాలను చూసి చలించిన అతడు తండ్రి నుంచి రూ.లక్ష తీసుకొని ‘AGRATE’ సంస్థ స్థాపించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్, ఎరువులు, ఆధునిక శిక్షణ ఇస్తూ ఉత్పత్తులకు మంచి మార్కెట్ కల్పించడంతో వారి ఆదాయం పెరిగింది. ప్రస్తుతం AGRATE టర్నోవర్ రూ.2.5 కోట్లు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 97

ఈరోజు ప్రశ్న: ఈ ఆలయంలో కొలువైన అంజన్న స్వామికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి హనుమంతుడిది కాగా, మరొకటి నరసింహస్వామిది. మూల విరాట్టు భుజాలపై శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 15, 2025
శుక్లా ఆలోచనలను మార్చేసిన కరోనా

బెంగళూరులో IT ఉద్యోగం చేస్తున్న ప్రిన్స్ శుక్లాకు కోవిడ్-19తో ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగం పోవడం, స్విస్ స్కాలర్షిప్ ఆగడంతో గ్రామానికి తిరిగి వచ్చారు. ఊళ్లో తిరుగుతూ సాగులో రైతులను వెనక్కి నెడుతున్న లోపాలను గుర్తించారు. పాత సాగు పద్ధతులు, సరైన మార్కెట్ లేకపోవడం, నాణ్యత లేని విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కొరతను గుర్తించారు. వీటిని రైతులకు అందించాలని రూ.లక్ష అప్పు చేసి ‘AGRATE’స్థాపించారు.


