News April 25, 2024
ఈ నెల 25న ఏపీఆర్జేసీ, డీసీ సెట్ పరీక్షలు

AP: ఈ నెల 25న APRJC, డీసీసెట్-2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. APRJCకి 32,666 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అలాగే డీసీ సెట్కు 56,949 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి రేపు మ.2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు కనీసం గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
Similar News
News March 26, 2026
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఆస్కారముందని చెప్పింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News March 26, 2026
RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్

IPL: ఎల్లుండి లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో RCB జట్టు కీలక బౌలర్ హేజిల్వుడ్ ఇండియా చేరుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ NOC ఇవ్వడంతో ఆయన కొద్దిసేపటి కిందటే బెంగళూరుకు వచ్చారు. ఇవాళ RCB క్యాంప్లో జాయిన్ కానున్న ఆయన 28వ తేదీ SRHతో జరిగే తొలి మ్యాచులో ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఆ జట్టు కీలక బౌలర్ యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో దూరమైన వేళ హేజిల్వుడ్ రాకతో RCB బౌలింగ్ దళం బలం పుంజుకున్నట్లు అయింది.
News March 26, 2026
సమ్మర్ స్పెషల్: మీ పిల్లలను ఛాంపియన్లుగా మార్చండి!

వేసవి సెలవుల్లో పిల్లల సమయాన్ని వృథా చేయకుండా ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్పించండి. ముఖ్యంగా పిల్లల శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో స్విమ్మింగ్ నేర్పించడం వల్ల శరీరం చల్లబడటమే కాక మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే ఏకాగ్రత కోసం యోగా, మెడిటేషన్.. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఇవి పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుస్తాయి. <<-se>>#SummerSPL<<>>


