News May 11, 2024
2014లో మోదీ ఇచ్చిన ఈ హామీలు నెరవేరాయా?: కేటీఆర్

TG: ‘మోదీ గ్యారంటీ’ అనే బీజేపీ నినాదం నవ్వు తెప్పిస్తోందని కేటీఆర్ అన్నారు. 2014లో ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ‘2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేశారా? యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? బుల్లెట్ ట్రైన్స్ తీసుకొచ్చారా? నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి ఇంటికీ రూ.15 లక్షలు ఇచ్చారా? మోదీ జీ.. మీ గ్యారంటీకి ఏమయ్యిందో దేశం తెలుసుకోవాలనుకుంటోంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 16, 2025
రేపు భారత్కు ఖతర్ అమీర్

ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్-థనీ రేపు, ఎల్లుండి భారత్లో పర్యటించనున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు అమీర్ భారత్కు వస్తున్నారని.. రాష్ట్రపతి, PM మోదీతో ఆయన భేటీ అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై ఈ పర్యటనలో చర్చలు జరుగుతాయని పేర్కొంది. 2015 మార్చిలో ఆయన తొలిసారి భారత్లో పర్యటించగా ఇది రెండో పర్యటన అని వెల్లడించింది.
News February 16, 2025
IPL 2025: సీఎస్కే తొలి మ్యాచ్ ఎవరితో అంటే?

మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడనున్నట్లు Espn Cricinfo పేర్కొంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచులో ఐదేసి సార్లు కప్పు గెలిచిన ఈ జట్లు పోటీపడతాయని తెలిపింది. కాగా ఆర్సీబీ VS కేకేఆర్ (ఈడెన్ గార్డెన్లో), SRH vs RR (HYDలో) తమ తొలి మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని చెప్పింది.
News February 16, 2025
మహిళా నిర్మాతపై విచారణకు కోర్టు ఆదేశాలు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్పై ముంబైలోని ఓ కోర్టు విచారణకు ఆదేశించింది. ఆమె నిర్మించిన ఓ వెబ్ సిరీస్లో భారత జవాన్లను అవమానపరిచేలా సన్నివేశాలున్నాయని వికాస్ పాఠక్ అనే యూట్యూబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి యూనిఫామ్లో ఓ నటుడితో అభ్యంతరకర సన్నివేశాలు చేయించారని అందులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేటు కోర్టు, ఏక్తాపై విచారణ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించింది.