News January 28, 2025
పని వేళల్లో నిద్ర ముంచుకొస్తోందా?

కొందరికి మధ్యాహ్న భోజనం అనంతరం నిద్ర ముంచుకు వస్తుంది. పని చేసేందుకు శరీరం ఏమాత్రం సహకరించదు. కానీ కొన్ని పద్ధతులు పాటిస్తే నిద్రను కట్టడి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఖచ్చితంగా ఒకే సమయానికి నిద్ర పోవాలి. రాత్రి వేళల్లో టీ, కాఫీ తాగితే సరిగా నిద్ర పట్టదు. దీంతో మధ్యాహ్నం నిద్ర వస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది. ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. టీవీ, ఫోన్లు చూడటం తగ్గించడం ఉత్తమం.
Similar News
News February 9, 2025
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్కు ఆదేశం

AP: తిరుపతి జనసేన ఇన్ఛార్జ్పై <<15400758>>ఆరోపణలు వస్తున్న<<>> వేళ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ను ఆదేశించింది. జనసైనికులు, వీర మహిళలు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
News February 9, 2025
థాంక్యూ మీట్కు హాజరుకాకపోవడంపై రష్మిక పోస్ట్

‘పుష్ప-2’ థాంక్యూ మీట్కు హాజరుకాని హీరోయిన్ రష్మిక ఆసక్తికర పోస్ట్ చేశారు. సుకుమార్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కలిసి తమ శ్రమతో ఇలాంటి అద్భుతాన్ని అందించినందుకు థాంక్యూ చెప్పారు. శ్రీవల్లి హృదయంలో తమకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగం చేసినందుకు, గుర్తుండిపోయే రోల్ ఇచ్చినందుకు మరోసారి థాంక్యూ అని రాసుకొచ్చారు.
News February 9, 2025
చిలుకూరు అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు <<15408903>>రంగరాజన్పై దాడి<<>> చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని.. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.