News May 26, 2024
కాసేపట్లో IPL ఫైనల్.. చూసేందుకు సిద్ధమా?

అసలే ఆదివారం.. ఆపై ఐపీఎల్ ఫైనల్. అందులోనూ బరిలో హైదరాబాద్ జట్టు. ఇంకేముంది మ్యాచ్ చూసేందుకు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చాలామంది గ్రూప్లుగా ఏర్పడి ఒకేచోట మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బయట ఏమైనా పనులున్నా సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి చేరుకునేలా ప్లాన్లు వేసుకుంటున్నారు. మరి మ్యాచ్ చూసేందుకు మీరెలా సన్నద్ధం అవుతున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News February 19, 2025
మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

TG: మూడో విడతలో ఐదు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. నారాయణ పేటకు సత్యయాదవ్, సూర్యాపేటకు శ్రీలత రెడ్డి, నిర్మల్కు రితేశ్ రాథోడ్, సిద్దిపేటకు బైరి శంకర్ ముదిరాజ్, రాజన్న సిరిసిల్లకు గోపి ముదిరాజ్ను నియమిస్తున్నట్లు తెలిపింది. సంస్థాగతంగా తెలంగాణలో బీజేపీకి 38 జిల్లాలు ఉన్నాయి. వీటిలో మూడు విడతల్లో 28 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది.
News February 18, 2025
సివిల్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు

సివిల్స్ అభ్యర్థులకు యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించింది. ఈ నెల 21 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఫిబ్రవరి 11తోనే ముగియగా ఇవాళ్టి వరకు పొడిగించింది. తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్లలో పొరపాట్ల సవరణకు ఫిబ్రవరి 22-28 వరకు అవకాశం ఇచ్చింది. కాగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25న జరగనుంది.
News February 18, 2025
శామ్సంగ్ S24 Ultra ధర ₹70,000.. ఎక్కడంటే?

మొబైల్ ఫోన్ల ధరలను పోల్చినప్పుడు ఇండియాలో ఎక్కువగా ఉండటంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కంపెనీల ఫోన్ల ధరలు దుబాయ్లో తక్కువగా ఉంటాయంటారు. SAMSUNG కంపెనీకి చెందిన S24 Ultra (12/256 GB) ఫోన్ దుబాయ్లో సుమారు ₹70,000లకే లభిస్తుంది. అదే ఇండియాలో ₹1,04,999 (ఆన్లైన్ షాపింగ్ సైట్). దాదాపు ట్యాక్సుల రూపంలో ₹35,000 అధికంగా వసూలు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి.