News January 20, 2025
బాబా రామ్దేవ్పై అరెస్ట్ వారెంట్

బాబా రామ్ దేవ్, పతంజలి MD ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మందులు, వ్యాధుల నివారణపై దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లు ఆ రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Similar News
News February 12, 2025
PHOTO OF THE DAY

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కొచ్చిలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో పవన్తో పాటు ఆయన కుమారుడు అకీరానందన్ కూడా ఉండటం విశేషం. తండ్రీకొడుకులు ఇద్దరూ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చి నమస్కరిస్తున్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఫొటో ఆఫ్ ది డే అంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.
News February 12, 2025
మొన్న 90 గంటల పని, భార్యనెంత సేపు చూస్తారు.. నేడు మరో వివాదం

వారానికి 90Hrs పని, భార్యను ఎంతసేపు చూస్తారన్న L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదానికి తెరతీశారు. టెకీస్ సహా భారత శ్రామికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడరని, పరిశ్రమలకు సవాళ్లు సృష్టిస్తారని చెప్పారు. ‘నేను జాయిన్ కాగానే నాది చెన్నై అయితే మా బాస్ ఢిల్లీకి రమ్మన్నారు. ఇప్పుడు నేను చెన్నై వ్యక్తికి ఇదే చెప్తే రీలొకేట్ అవ్వడానికి ఇష్టపడరు. IT ఉద్యోగులైతే ఆఫీసుకు రమ్మంటే BYE చెప్పేస్తార’న్నారు.
News February 12, 2025
భారత్ భారీ స్కోర్

ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. గిల్ సెంచరీ(112)తో అదరగొట్టగా శ్రేయస్ 78, కోహ్లీ 52, రాహుల్ 40 రన్స్తో రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. గత మ్యాచ్లో సెంచరీతో అలరించిన కెప్టెన్ రోహిత్ ఈసారి ఒక్క పరుగుకే ఔట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 4, వుడ్ 2 వికెట్లతో సత్తా చాటారు.