News March 21, 2024
అరుణాచల్ భారత్దే.. అమెరికా స్పష్టీకరణ

అరుణాచల్ ప్రదేశ్ భారత్దేనని చైనాకు అమెరికా తాజాగా స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్ని మార్చేందుకు లేదా ఆక్రమించేందుకు ఏకపక్షంగా చేసే ఏ చర్యనైనా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని తేల్చిచెప్పింది. అరుణాచల్ తమదేనంటూ చైనా సైన్యం ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను భారత్ ఖండించింది. ఆ ప్రాంతం భారత్లో అంతర్భాగమని కుండబద్దలుగొట్టింది.
Similar News
News February 4, 2026
దేశీ మిర్చికి రికార్డు ధర.. క్వింటా రూ.41,200

TG: వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ మిర్చి రికార్డు ధర పలికింది. క్వింటా మిర్చి రూ.41,200కు అమ్ముడుపోయింది. గత మూడేళ్లలో దేశీ మిర్చికి ఇదే రికార్డు ధర అని మార్కెట్ అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దస్తగిరి అనే రైతు తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల దేశీ మిర్చిని వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేశారు.
News February 4, 2026
గడాఫీ కుమారుడి హత్య

లిబియా నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ(53)ని దుండగులు హత్య చేశారు. జింటాన్లోని ఇంటిపై నలుగురు సాయుధులు దాడి చేసి హతమార్చినట్లు ఆయన అడ్వైజర్ అబ్దుల్లా వెల్లడించారు. తన తండ్రి హయాంలో ఇస్లాం ఎలాంటి పదవి చేపట్టకపోయినా మితవాది, సంస్కర్త అనే ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. 2011 తిరుగుబాటులో గడాఫీ హతమైన తర్వాత 2021లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
News February 4, 2026
వరిలో ఈ తెగుళ్లు కనిపిస్తున్నాయా? నివారణ ఎలా?

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో పురుగులు, చీడపీడల ఉద్ధృతి ఎక్కువైంది. ప్రధానంగా వరిలో మానిపండు తెగులు, పాముపొడ(మాగుడు) తెగులు, రెల్లరాల్చు పురుగు, కాండం కుళ్లు/దుబ్బు కుళ్లు కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పంట ఎదుగుదల తగ్గి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగుళ్ల కట్టడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


