News February 24, 2025

నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు

image

AP: చాలా కాలం తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ చీఫ్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. దీంతో అధికార, విపక్ష పార్టీ నేతల పరస్పర విమర్శలతో సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. ఇవాళ ఉ.10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Similar News

News February 24, 2025

చరిత్ర సృష్టించిన కోహ్లీ

image

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీతో చెలరేగి POTM పొందిన విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ICC ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక(5) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఛేజ్ మాస్టర్ 2012 T20WC, 2015 ODI WC, 2016 T20WC, 2022 T20WC, 2025 CTలో దాయాదిపై POTM పొందారు. మరే ఇతర ప్లేయర్ ప్రత్యర్థి జట్టుపై 3 కంటే ఎక్కువ అవార్డులు సాధించకపోవడం గమనార్హం.

News February 24, 2025

పాపం ఆ 8 మంది.. ఎలా ఉన్నారో?

image

TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎలా ఉన్నారో? అని సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వారు అందులో చిక్కుకొని సుమారు 48 గంటలవుతోంది. ప్రమాదం జరిగిన 14వ కి.మీ వద్ద భీతావహ పరిస్థితిని చూసి రెస్క్యూ సిబ్బంది ఒకింత భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కానీ ఆశలు వదులుకోకుండా శిథిలాల తొలగింపు చేపట్టారు. అయితే వాటిని తొలగిస్తే పైకప్పు మళ్లీ కూలొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News February 24, 2025

RC16 షూటింగ్ ఢిల్లీకి షిఫ్ట్?

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీ షెడ్యూల్ HYDలో పూర్తయినట్లు తెలుస్తోంది. చెర్రీ-దివ్యేందులపై క్రికెట్ సన్నివేశాలను తెరకెక్కించినట్లు సమాచారం. మార్చి ఫస్ట్ వీక్‌లో ఢిల్లీలో కుస్తీ నేపథ్య సీన్లను చిత్రీకరిస్తారని, కీలక నటీనటులంతా పాల్గొంటారని టాక్. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా MAR 27న చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది.

error: Content is protected !!