News February 9, 2025

సీఎం పదవికి ఆతిశీ రాజీనామా

image

ఢిల్లీ సీఎం పదవికి ఆతిశీ మార్లేనా రిజైన్ చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందజేశారు. కాగా నిన్న వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. మొత్తం 70 సీట్లలో బీజేపీ 48 స్థానాలు గెలుచుకొని అధికారం చేపట్టింది.

Similar News

News November 26, 2025

ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం!

image

ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం. 200ఏళ్లు బ్రిటిష్ పాలనలో మగ్గిన ప్రజలకు మహోన్నత శక్తినిచ్చింది ఈ రాజ్యాంగమే. అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రాజ్యాంగాన్ని రచించింది. దీనికి 1949 NOV 26న ఆమోదం లభించింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో NOV 26న రాజ్యాంగ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.

News November 26, 2025

ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం!

image

ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం. 200ఏళ్లు బ్రిటిష్ పాలనలో మగ్గిన ప్రజలకు మహోన్నత శక్తినిచ్చింది ఈ రాజ్యాంగమే. అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రాజ్యాంగాన్ని రచించింది. దీనికి 1949 NOV 26న ఆమోదం లభించింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో NOV 26న రాజ్యాంగ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.

News November 26, 2025

కోచ్ చెప్తారు.. స్కోర్ చేయాల్సింది ప్లేయర్లే: సురేశ్ రైనా

image

ప్లేయర్లు సరిగ్గా ఆడకుంటే కోచ్‌ను నిందించడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నారు. ‘ప్లేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కోచ్‌కు చెప్పాలి. వాళ్లు బాగా ఆడితే కోచ్‌కు ప్రశంసలు దక్కుతాయి. టీమ్ బాగా ఆడకుంటే కోచ్‌ను తొలగించాల్సిన అవసరం లేదు. ప్లేయర్లకు సలహాలు, మద్దతు ఇవ్వడం కోచ్ పని. స్కోర్ చేయాల్సింది ప్లేయర్లే. కోచ్ గంభీర్ తన పని కరెక్ట్‌గా చేస్తున్నారు’ అని రైనా చెప్పారు.