News December 12, 2024

దారుణం.. బాలికను ముక్కలుగా నరికేశాడు!

image

ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని ధరౌథి పీఎస్ పరిధిలో బాలికను రేప్ చేసిన కను కిస్సాన్ అనే వ్యక్తి గతేడాది AUG జైలుకెళ్లాడు. DECలో బెయిల్‌పై వచ్చిన అతను బాలికను చంపేశాడు. ఆపై శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికేసి పలు ప్రాంతాల్లో ఆ భాగాలు విసిరేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. రేప్ కేసులో బాధితురాలైన బాలిక కోర్టులో స్టేట్‌మెంట్ ఇస్తుందనే భయంతో హత్య చేసినట్లు అతను వివరించారు.

Similar News

News January 21, 2025

HEADLINES

image

*అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం
*కోల్‌కతా హత్యాచార దోషికి జీవిత ఖైదు
*లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్లు.. హైకమాండ్ ఆగ్రహం
*పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు: Dy.CM పవన్
*ఏపీలో 26 మంది IASలు, 27 మంది IPSలు బదిలీ
*స్విట్జర్లాండ్‌లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
*తెలంగాణలో మళ్లీ రానున్న కింగ్ ఫిషర్ బీర్లు
*రేవంత్‌కు చుక్కలు చూపెట్టాలి: KTR

News January 21, 2025

ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు

image

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. అధ్యక్షుడిగా పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలి. ఇరు దేశాల ప్రయోజనం కోసం కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.

News January 21, 2025

వారిని ప్రోత్సహించడంలో వివక్ష ఉండదు: ట్రంప్

image

అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ట్రంప్ అన్నారు. ‘నేరాలు చేసే ముఠాలతో కఠినంగా వ్యవహరిస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలు అధికంగా తయారు చేస్తాం. అమెరికన్ డ్రీమ్ అనేది ప్రపంచ నలుమూలల్లోని ప్రతిభావంతుల కల. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో వివక్ష ఉండదు. శాంతి నెలకొల్పేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తాం. నిన్న గాజాలో బందీలు విడుదల కావడం సంతోషంగా ఉంది’ అని ట్రంప్ వివరించారు.