News November 14, 2024
దారుణం: అత్యాచారం చేసి, ఎముకలు విరగ్గొట్టి..

కుకీ, మెయితీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో మణిపుర్ అట్టుడికిపోతోంది. ఇటీవల జిరిబామ్ జిల్లాలో కుకీ తెగకు చెందిన మహిళా టీచర్(31)పై అనుమానిత మెయితీ దుండగులు అత్యాచారం చేసి దహనం చేసిన కేసులో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఆమె శరీరం 99% కాలిపోవడంతో అత్యాచార నమూనాలు తీయడం సాధ్యం కాలేదు. 8 చోట్ల గాయాలున్నాయి. ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. పుర్రె వేరుపడింది’ అని అటాప్సీ రిపోర్టు వెల్లడించింది.
Similar News
News April 18, 2026
‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
News April 18, 2026
సోమవారం రెండో విడత శాంతి చర్చలు!

అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. అందుకు మరోసారి పాకిస్థాన్ను వేదికగా ఎంచుకున్నాయి. ఇస్లామాబాద్లో వచ్చే సోమవారం చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఇరాన్ ప్రతినిధులు పాక్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.
News April 18, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.


