News March 11, 2025

YCP హయాంలో 228 ఆలయాలపై దాడులు: ఆనం

image

AP: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 228 ఆలయాలపై దాడులు జరిగాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కానీ వీటిపై 32 కేసులే నమోదయ్యాయని శాసనమండలిలో చెప్పారు. ‘ఆలయాలపై దాడులకు సంబంధించి విచారణకు ఆదేశించాం. వీటిపై పూర్తి నివేదిక అందించాలని అధికారులకు సూచించాం. ఆలయాలపై దాడులు జరగకుండా CC కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని RTGSకు లింక్ చేశాం’ అని ఆయన వెల్లడించారు.

Similar News

News March 19, 2025

ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించండి: మంత్రి నాదెండ్ల

image

AP: దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అన్నదాతలకు అందుబాటులో 5 లక్షల గన్నీ సంచులున్నాయని తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News March 19, 2025

అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి: సుప్రీం

image

దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దేశంలో దాదాపు 80 శాతం మంది నిరుపేదలు ఉన్నారని, వారందరికీ ఆహార భద్రత ఎంతో అవసరమని పేర్కొంది.

News March 19, 2025

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

image

ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
✤ రూ.2 వేల కంటే తక్కువ లావాదేవీలకు (పర్సన్ టు మర్చంట్) యూపీఐ ఛార్జీలు ఉండవు
✤ అస్సాంలో రూ.10,601 కోట్లతో అమ్మోనియా, యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటు
✤ మహారాష్ట్రలో రూ.4,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే
✤ గోకుల్ మిషన్‌కు రూ.3,400 కోట్లు.

error: Content is protected !!