News August 5, 2024
స్వయంప్రతిపత్తిని లాక్కొనే ప్రయత్నం: అసదుద్దీన్ ఒవైసీ

మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వక్ఫ్ బోర్డ్ స్వయంప్రతిపత్తిని లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ప్రతిపాదనలు పార్లమెంటు ముందుకు రాకుండానే మీడియాలో రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సవరణలు అమోదం పొందితే ఆస్తుల ఆక్రమణలపై విచారణ జరిపే వక్ఫ్ ట్రిబ్యునల్ అన్ని హక్కులు కోల్పోతుందని ఆయన వివరించారు.
Similar News
News September 15, 2025
ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్?

రూమర్డ్ బాయ్ఫ్రెండ్ రచిత్ సింగ్తో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్ కోచ్ అయిన రచిత్తో హుమా ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై హుమా స్పందించాల్సి ఉంది.
News September 15, 2025
ఈనెల 17న విశాఖలో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఈనెల 17న విశాఖలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.15AMకి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఆర్కే బీచ్ రోడ్డులో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్లో పాల్గొంటారు. 12PMకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో ప్రసంగిస్తారు. అనంతరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్కు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.
News September 15, 2025
సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా

ఆసియా కప్లో టీమిండియా సూపర్-4కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో UAE ఘన విజయం సాధించడంతో భారత్కు లైన్ క్లియర్ అయింది. టీమిండియా ఇప్పటికే UAE, పాక్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మెరుగైన నెట్ రన్రేట్(4.793) కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్, UAE పోటీ పడనున్నాయి.