News January 4, 2025
ఆసీస్ ఆలౌట్

సిడ్నీలో జరుగుతున్న BGT ఐదో టెస్టులో ఆసీస్ 181 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 185 రన్స్ చేయగా ఆస్ట్రేలియా 4 రన్స్ వెనుకంజలో నిలిచింది. టీమ్ఇండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, సిరాజ్ 3, బుమ్రా 2, నితీశ్ రెడ్డి 2 వికెట్లు తీశారు. ఆసీస్ జట్టులో డెబ్యుటంట్ వెబ్స్టర్ 57 పరుగులు, స్మిత్ 33 పరుగులతో రాణించారు. ఇవాళ మరో 40 ఓవర్లు ఆట జరిగే ఛాన్స్ ఉంది.
Similar News
News October 24, 2025
న్యూస్ రౌండప్

AP: కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సును తొలగిస్తుండగా బోల్తా పడిన క్రేన్, ఆపరేటర్కు గాయాలు.. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
● బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి పార్థసారథి
● ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మృతిపై వైసీపీ చీఫ్ జగన్ సంతాపం
TG: అంగన్వాడీ సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి: మంత్రి సీతక్క
● మూడో వన్డే కోసం సిడ్నీకి చేరుకున్న టీమ్ఇండియా
News October 24, 2025
ఇతిహాసాలు క్విజ్ – 45 సమాధానాలు

1. రావణుడు పుష్పక విమానాన్ని ‘కుబేరుడి’ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాడు.
2. కురు రాజ్యానికి మంత్రి ‘విదురుడు’.
3. ఆంజనేయుడికి గదను ఆయుధంగా ‘కుబేరుడు’ ఇచ్చాడు.
4. లక్ష్మీదేవి ‘క్షీరసాగర మథనం (పాల సముద్రం చిలికినప్పుడు) సమయంలో’ ఆవిర్భవించింది.
5. యమధర్మరాజు సోదరి ‘యమునా దేవీ’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 24, 2025
బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.


