News December 29, 2024
AUSvsIND: భారత్ ఆలౌట్

మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న రాత్రి సెంచరీతో నాటౌట్గా ఉన్న నితీశ్, వేగంగా పరుగులు చేసే క్రమంలో లయన్ బౌలింగ్లో 114 పరుగులకు ఔటయ్యారు. ఆస్ట్రేలియాకు 105 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయన్కు తలో 3 వికెట్లు దక్కాయి.
Similar News
News November 22, 2025
పాలమూరు: యాక్సిడెంట్లో మహిళ మృతి.. గుర్తిస్తే చెప్పండి

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం ఎర్రవల్లి మండలంలో జరగింది. కొండేరు శివారులోని పెట్రోల్ బంకు దగ్గర హైవే దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ దుర్మరణం పాలైంది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు మండల ఎస్సై రవి తెలిపారు. మృతురాలి చేతిపై లింగస్వామి అనే పచ్చబొట్టు ఉందన్నారు. ఎవరైనా గుర్తిస్తే 9346987198 నంబర్కు కాల్ చేయాలన్నారు.
News November 22, 2025
AP TET..అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏపీ టెట్కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రేపటితో అప్లికేషన్ల ప్రాసెస్ ముగియనుండటంతో అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు మాక్ టెస్ట్ ఆప్షన్ NOV 25న అందుబాటులోకి వస్తుంది. DEC 3నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. DEC 10 నుంచి ప్రతిరోజూ 2 సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. వెబ్సైట్: https://tet2dsc.apcfss.in/
News November 22, 2025
పంట మునిగినా, జంతువుల దాడిలో దెబ్బతిన్నా ఫసల్ బీమా

PM ఫసల్ బీమా యోజనలో ఇప్పటి వరకు కరవు, వడగళ్లు, తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగితే బీమా చెల్లించేవారు. ఇక నుంచి దాని పరిధి పెంచారు. ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుంది. భారీ వర్షాల వల్ల పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోయినా, దెబ్బతిన్నా పరిహారం చెల్లిస్తారు. 2026 ఖరీఫ్ సీజన్ (జూన్-జులై) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2025-26 ఖరీఫ్ సీజనుకు ఇది వర్తించదు.


