India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో నేటి నుంచి 5 రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలోని బుగ్గబావిగూడలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.
TG: అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ సర్వే ప్రారంభించింది. పంటలు దెబ్బతిన్న జిల్లాల్లో అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. నిన్న కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹10వేల చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరిగే ఛాన్స్ ఉంది. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ తయారు చేసిందని బోర్డు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతానికి తొలి 21 మ్యాచులకు మాత్రమే షెడ్యూల్ విడుదలైంది. తాజాగా మిగిలిన షెడ్యూల్ను కూడా రూపొందించారని, మే 26న చెన్నైలో ఫైనల్ జరిగేలా నిర్ణయించినట్లు సదరు అధికారి పేర్కొన్నారు. ఇక గుజరాత్ స్టేడియంలో క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచులను జరపనున్నారని తెలిపారు.
AP: ప్రజాశాంతి పార్టీకి కామన్ గుర్తుగా హెలికాప్టర్ గుర్తు ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 19న ఈ విషయంలో ఈసీకి వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఆయన పిటిషన్లో తెలిపారు. తమకు కామన్ సింబల్ ఇచ్చేలా ఈసీని ఆదేశించాలని కోరారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం, ఈసీ కౌంటర్ పరిశీలన అనంతరం తగిన ఉత్తర్వులిస్తామని పేర్కొంటూ ఈ నెల 27కు విచారణ వాయిదా వేసింది.
AP: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లైసెన్సెడ్ ఆయుధాలు కలిగిన ఉన్నవారందరూ వాటిని వారి సమీప పోలీసు స్టేషన్లో సమర్పించాలని రాష్ట్ర పోలీసు శాఖ తాజాగా సూచించింది. ఎన్నికలయ్యేవరకు కొత్త ఆయుధాల జారీని కూడా నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. తమ వద్ద సమాచారం ఉన్న లైసెన్సుదారులందరికీ పోలీసులు ఈ సమాచారాన్ని పంపుతున్నారు. రాష్ట్రంలో సుమారు 10 వేలమంది వరకు గన్ లైసెన్సు కలిగి ఉన్నట్లు సమాచారం.
ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కేకేఆర్ జట్టు మిచెల్ స్టార్క్ను కొనుగోలు చేసింది. అయితే, నిన్న సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో స్టార్క్ తన 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నారు. ఆయన ఐపీఎల్ కెరీర్లోనే ఇవి అత్యంత చెత్త గణాంకాలు కావడం గమనార్హం. దీంతో KKRపై నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అంత డబ్బు పోసి కొనుక్కున్నది ఇలా ధారాళంగా పరుగులిచ్చేందుకా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
AP: ఎన్డీయే కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాను తుది దశకు తెచ్చేశాయి. కానీ బీజేపీ మాత్రం ఇంకా నాన్చుడు ధోరణిలోనే ఉండటం కూటమి ప్రచారానికి స్పీడ్ బ్రేకర్గా మారుతోంది. పొత్తులో భాగంగా 8 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేయాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీకి ప్రస్తుతం స్పష్టత లేదంటున్నారు పరిశీలకులు. అందుకే ప్రకటనలో ఆలస్యం జరుగుతోందని విశ్లేషిస్తున్నారు.
యూపీలో సుపారీ ఇచ్చి మరీ కన్నతండ్రిని చంపించాడో సుపుత్రుడు. ప్రతాప్గఢ్కు చెందిన మహ్మద్ నసీమ్(50) ఓ వ్యాపారవేత్త. అతడికి 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అడిగినప్పుడల్లా తండ్రి డబ్బులివ్వడం లేదని పగ పెంచుకున్న సదరు కొడుకు, ఆయన్ను చంపేందుకు ముగ్గురు కిల్లర్లకు డబ్బులిచ్చాడు. వారు నసీమ్ను తుపాకులతో కాల్చి చంపారు. పోలీసులు దుండగుల్ని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.
వైజాగ్లో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ చీఫ్ పురందీశ్వరి సంబంధీకులు ఉన్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఆరోపించారు. ‘దీనిపై సీబీఐ సహా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు తీరు దొంగే దొంగా అని అరిచినట్లుగా ఉంది. పురందీశ్వరి తనయుడు కూడా ఆ కంపెనీలో వాటాదారుడే. డ్రగ్స్ కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు మాకు అనుమానాలున్నాయి’ అని సజ్జల పేర్కొన్నారు.
నిన్న రాత్రి జరిగిన SRH, KKR మ్యాచ్లో ఉత్కంఠ పోరులో కోల్కతా విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ సన్రైజర్స్ బ్యాటర్ క్లాసెన్ చెలరేగి ఆడారు. ఆయన సిక్సులు కొడుతున్నప్పుడు జట్టు యజమాని కావ్య మారన్ గంతులు వేస్తూ కనిపించారు. అయితే చివరి ఓవర్లో 5 బంతుల్లో జస్ట్ 7 రన్స్ చేయాల్సి ఉండగా ఓడిపోవడంతో ఆమె డీలా పడ్డారు. ఈ రెండు సందర్భాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.