India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వారాంతంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. టారిఫ్స్ను 90 రోజులు నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 1,310 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 429 పాయింట్లు వృద్ధి సాధించింది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, NTPC, M&M, రిలయన్స్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సెర్వ్, భారతీ ఎయిర్టెల్, HDFC బ్యాంక్ షేర్లు భారీ లాభాలు సాధించాయి.
తనకు వెయ్యి రోజులుగా రుతుస్రావం అవుతున్నట్లు అమెరికాకు చెందిన టిక్టాకర్ పాపి వెల్లడించారు. 950 రోజుల తీవ్ర ఆవేదన తర్వాత ఆమె ఈ విషయాన్ని తన యూజర్లతో పంచుకున్నారు. మహిళలకు సాధారణంగా నెలలో 3-7 రోజుల పాటు పీరియడ్ బ్లీడింగ్ జరుగుతుంటుంది. మొదట్లోనే టెస్టులు చేయించానని, వైద్యులు సైతం అయోమయంలో పడినట్లు ఆమె తెలిపారు. చివరికి తనకు బైకార్న్యుయేట్ యుట్రస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో నెగటివిటీని ప్రచారం చేసే వారికి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందని హీరోయిన్ త్రిష ఇన్స్టాలో ప్రశ్నించారు. ఖాళీగా కూర్చొని ఇతరులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేయడమే పనా అని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారితో కలిసి జీవించేవారి గురించి ఆలోచిస్తే బాధగా అనిపిస్తుందన్నారు. నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి తమిళంలో డబ్బింగ్ చెప్పకపోవడంతో SMలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
జిల్లా కోర్టుల్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 785 ఈవెనింగ్ కోర్టులు ఏర్పాటు చేయాలని న్యాయ శాఖ యోచిస్తోంది. ప్రస్తుత కోర్టు ప్రాంగణాల్లోనే సాధారణ పనివేళల అనంతరం 5pm-9pm మధ్య ఇవి పనిచేస్తాయని సమాచారం. గత 3 ఏళ్లలో రిటైరైన జడ్జీలను కాంట్రాక్టు పద్ధతిలో వీటిలో నియమిస్తారని తెలుస్తోంది. మైనర్ క్రిమినల్ కేసులు, 3 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించదగిన కేసులను ఈ కోర్టుల్లో విచారించనున్నారు.
తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్గా ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అన్నామలై కూడా నాగేంద్రన్ పేరును ప్రతిపాదించగా, ఇతర నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం.
AP: టీడీపీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. మరోవైపు అమరావతిలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. జూన్లో కామన్ ఎంట్రన్స్ టెస్టు తెలుగు సహా 13 భాషల్లో ఉండనుంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎనిమిది, టెన్త్ పాసైన 17-21 ఏళ్ల యువకులు అర్హులు.
వెబ్సైట్: www.joinindianarmy.nic.in
అకాల వర్షాల కారణంగా బిహార్లో 80 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ తెలిపారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలు, పిడుగుల వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పంటలకు అపార నష్టం కలిగిందన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.4లక్షల చొప్పున పరిహారం అందించామన్నారు.
TG: అకాల వర్షాలతో రాష్ట్రంలో పలు చోట్ల ధాన్యం తడిసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని, తరుగు తీస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ మంచి పథకమని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
వివాహ బంధానికి విడాకులతో వీడ్కోలు పలికిన సమంత, చైతూ తమ పెంపుడు కుక్కకు మాత్రం కో-పేరెంట్స్గా కొనసాగుతున్నారని ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశాడు. ‘విడాకులకు ముందే హ్యాష్ అనే శునకాన్ని సామ్ దత్తత తీసుకున్నారు. డివోర్స్ అనంతరం చైతూ వద్ద కూడా అది కనిపించింది. వారు దానికి కో-పేరెంటింగ్ చేస్తున్నట్లున్నారు’ అని రాసుకొచ్చాడు. మనుషులు విడిపోయినా మూగ జీవాలను దూరం చేసుకోవద్దని నెటిజన్లు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.