India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ CMగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టి 50 రోజులు పూర్తయినా అధికారిక నివాసంపై నిర్ణయం తీసుకోలేదు. మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించిన బంగ్లాలోకి వెళ్లడానికి ఆమె ఇష్టపడలేదు. షాలిమార్ బాగ్లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో VIPలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 25KM ప్రయాణించి ఆమె సచివాలయానికి వెళ్తున్నారు. సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్లో నివాసం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
వృథా ఖర్చులు తగ్గించుకోవడం కోసమంటూ నిలిపివేసిన USAID పునరుద్ధరణకు USA చర్యలు తీసుకుంటోంది. ఎక్కడో పొరపాటు జరిగిందని, నిధులు పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఫండ్స్ నిలిపివేయడంతో అంతర్యుద్ధాలతో అల్లాడే 14 దేశాలకు ఆహార సహాయం నిలిచిపోయింది. ఈ దేశాల్లో ఆకలి చావులు సంభవిస్తాయంటూ ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ప్రపంచ ఆహార కార్యక్రమ(WFP) చెల్లింపులకు USA ముందుకొచ్చింది.
యంగ్టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటారని మూవీ మేకర్స్ తెలిపారు. ఈ క్రేజీ అప్డేట్తో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
TG: 2025-26 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాలు ఎలా చేపడతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆన్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా, కాలేజీలకు గ్రేడింగ్ ఇవ్వడం, ఫీజులు నిర్ణయించడం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వమే ఫీజులు నిర్ణయిస్తే, కాలేజీలు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. దీంతో పాత విధానంలోనే ముందుకెళ్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ దరఖాస్తులకు రేపే తుది గడువు. ‘అగ్నివీర్గా ఆర్మీలో చేరండి. గౌరవం, క్రమశిక్షణతో కూడిన ప్రయాణానికి సిద్ధంకండి’ అంటూ Xలో ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టరేట్ జనరల్ ట్వీట్ చేశారు. ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ పరీక్షల ద్వారా నియామకాలు జరుగుతాయి. Age లిమిట్ 17.5-21yrs. www.joinindianarmy.nic.in సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
చైనా హెబీ ప్రావిన్స్లోని ఓ నర్సింగ్ హోమ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది చనిపోగా పలువురు గాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఫైర్ యాక్సిడెంట్కు గల కారణాలను వెల్లడించలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది.
సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన Dy.CM పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. రాత్రి ఆస్పత్రికి చేరుకున్న పవన్ పిల్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల తలెత్తే సమస్యలపై పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ గదికి తీసుకొచ్చామన్నారు. మరో 3 రోజులపాటు టెస్టులు చేయాల్సి ఉందని వెల్లడించారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదన్న చందాన బ్యాంకుల తీరు తయారైంది. వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించినా చాలా బ్యాంకులు తగ్గించడం లేదు. దీంతో లోన్లు, EMIలు కట్టేవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెపో రేటు తగ్గినా సామాన్యులకు వర్తింపజేయాలా? వద్దా? అనేది బ్యాంకులపై ఆధారపడి ఉండటమే వడ్డీ తగ్గకపోవడానికి కారణం. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా బ్యాంకులు ఇలా చేస్తుంటాయి. మీకూ ఇలా ఎప్పుడైనా జరిగిందా?
టారిఫ్ల విషయంలో కొన్ని దేశాలు తనను బతిమాలుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘ప్లీజ్.. ప్లీజ్ సార్. మీతో ఎలాంటి డీల్కైనా సిద్ధం. ఇందుకోసం ఏమైనా చేస్తాం అని కొన్ని దేశాలు వెంపర్లాడుతున్నాయి. అయినా నేను అన్నీ తెలిసే టారిఫ్లను విధించా. వీటిని మళ్లీ పున:సమీక్షించే ఛాన్సే లేదు. సుంకాల దెబ్బకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. KISSING MY A**’ అంటూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ₹710 పెరిగి ₹90,440కు, 22 క్యారెట్ల గోల్డ్ ₹650 పెరిగి ₹82,900కు చేరాయి. అటు వెండి ధర మాత్రం రూ.1000 తగ్గి కేజీ రూ.1,02,000 పలుకుతోంది.
Sorry, no posts matched your criteria.