India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో అరుదైన గోల్డెన్ టైగర్ కనిపించింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ సుధీర్ శివరామ్ బంగారు వర్ణపు పులి ఫొటోలను తన కెమెరాలో బంధించారు. సూడోమెలనిజం అనే అరుదైన జన్యు మార్పు కారణంగా ఇవి బంగారు-నారింజ రంగులో ఉంటాయని పశుసంరక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి చాలా అరుదని, ఎక్కడో ఓ చోట మాత్రమే కనిపిస్తాయని తెలిపారు.
AP: చెడు ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. చాలా వ్యాధుల నివారణకు నియంత్రిత ఆహారపు అలవాట్లు అవసరమని సూచించారు. ‘నలుగురు సభ్యుల కుటుంబంలో నెలకు 600 గ్రాముల ఉప్పు, 2 లీటర్ల వంట నూనె, 3 కిలోల పంచదార వాడితే సరిపోతుంది. ఉప్పు, వంటనూనె, చక్కెర తగ్గిస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. రాష్ట్ర ప్రజలు ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో పసిడి ధర 38% మేర పతనం అవుతుందని అంచనా వేస్తున్నట్లు USA అనలిస్ట్ జాన్ మిల్స్ వెల్లడించారు. అమెరికాలో ఇప్పుడు $3080గా ఉన్న ఔన్స్ పుత్తడి $1820కు దిగి రావచ్చన్నారు. అంటే మన దగ్గర 10గ్రా. ₹56వేలకు వస్తుందన్నమాట. బంగారం సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడం, మార్కెట్ పరిస్థితులు దీనికి కారణాలుగా పేర్కొన్నారు.
NOTE: ఇది మిల్స్ అంచనా. అన్ని పరిశీలించి కొనుగోలు/అమ్మకాల నిర్ణయం తీసుకోండి.
AP: ప్రతీ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో గుండెజబ్బులు, డయాబెటిస్, హైపర్టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్నిచోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో CM వివరించారు.
సౌత్ కొరియాకు చెందిన మహిళలు ఎంతో బ్యూటిఫుల్గా ఉంటారని ‘ఇన్సైడర్ మంకీ’ రిపోర్టులో తేలింది. టాప్-50 దేశాల జాబితాలో ఇండియా 18వ స్థానంలో నిలిచింది. సౌత్ కొరియా తర్వాత బ్రెజిల్, అమెరికా, జపాన్, మెక్సికో, జర్మనీ, కొలంబియా, థాయ్లాండ్, ఇటలీ, వెనిజుల దేశాలు టాప్-10లో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని MLC కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. HYDలో ఈ అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. పన్ను వసూళ్లలో మనమే ఎక్కువ చెల్లిస్తున్నామని వివరించారు. కానీ ఉత్తరాదికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, దక్షిణాదిని కేంద్రం మోసం చేస్తోందన్నారు.
‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ లుక్తోనే అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. హీరో నానిని సరికొత్తగా చూపిస్తోండగా తాజాగా మరో న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించనుందని తెలుస్తోంది. ఇదే విషయమై హీరోయిన్తో దర్శకుడు చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ‘దసరా’లో కీర్తిని డీగ్లామర్గా చూపించగా ఈ మూవీలో బేబమ్మను ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
TG: HCU భూములపై ఫేక్ ప్రచారం చేసిన ప్రముఖులను విచారించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ నేత జగదీశ్, నటులు జాన్ అబ్రహం, రవీనా టాండన్, ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ తదితర ప్రముఖులను విచారించనున్నట్లు సమాచారం. కాగా HCU భూములపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈనెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని మిథున్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కొన్ని ప్రాంతాల్లో వివాహాల్లో వరుడి చెప్పులను దాచి కట్నం తీసుకోవడం ఆచారం. UP బిజ్నోర్లో ఓ వరుడిని ₹50వేలు డిమాండ్ చేశారు. అతడు ₹5వేలు ఇవ్వడంతో గొడవ జరిగింది. తక్కువ డబ్బు ఇచ్చినందుకు వధువు వైపు మహిళలు వరుడిని ‘బిచ్చగాడు’ అని తిట్టడంతో ఇరు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. దీంతో వధువు కుటుంబం (బావమరుదులు) వరుడిని రూమ్లో బంధించి కర్రలతో కొట్టింది. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది.
Sorry, no posts matched your criteria.