India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న క్విక్ కామర్స్ సంస్థలు సంప్రదాయ చిరు వ్యాపారుల పొట్టకొడుతున్నాయి. ఈ పది నిమిషాల డెలివరీ సంస్థలు భారీ దేశీ, విదేశీ పెట్టుబడులతో ఆఫర్లు, అర్ధరాత్రి తర్వాతా సేవలు అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో చాలా మంది ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఇదే కొనసాగితే వచ్చే ఐదేళ్లలో నగర వీధుల్లో కిరాణా, కూరగాయల, పండ్ల దుకాణాలు కనుమరుగవ్వొచ్చు.
RBI మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ఆర్థిక పరిస్థితులు, పాలసీ రేట్లపై సమీక్షించనుంది. FEBలో రెపోరేట్ను 6.5నుంచి 6.25కి తగ్గించిన విషయం తెలిసిందే. ఎకనామిక్ గ్రోత్ను ప్రోత్సహిస్తూ మరో 25 బేసిస్ పాయింట్స్ తగ్గించొచ్చని SBI అంచనా వేసింది. కొంతమంది నిపుణులు 50Pts కోత అవసరమంటున్నారు. దీనిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీటింగ్ అనంతరం ఏప్రిల్ 9న ప్రకటన విడుదల చేయనున్నారు.
ఇవాళ ముంబై బౌలర్ల రూపంలో ఆర్సీబీకి సవాల్ ఎదురుకానుంది. స్వింగ్తో మ్యాజిక్ చేసే బౌల్ట్, దీపక్ చాహర్లకు తోడుగా బుమ్రా వస్తున్నారు. వీరిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఒకపక్క పొదుపుగా బౌలింగ్ చేస్తూనే మరోపక్క వికెట్లు తీస్తారు. ఇక కెప్టెన్ హార్దిక్ గత మ్యాచులో 5 వికెట్లు తీసి జోరుమీద ఉన్నారు. యువ బౌలర్లు అశ్వనీకుమార్, విఘ్నేశ్లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
AP: రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3,535 కోట్లు వచ్చాయి. వీటికి కేంద్ర నిధులు కూడా తోడవ్వడంతో రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. గత నెల దాదాపు 70 పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
అమెరికన్ టీవీ నటుడు జే నార్త్(73) కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున చనిపోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ‘డెన్నిస్ ది మెనస్’తో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించారు. వాంటెడ్, 77 సన్సెట్ స్ట్రిప్, షుగర్ఫుట్ వంటి షోల్లో గెస్ట్ పాత్రల్లో మెరిశారు. ది టీచర్, మాయ వంటి చిత్రాల్లోనూ నటించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) 2030లోగా మానవులతో సమానమైన మేధస్సు(AGI)ను సాధిస్తుందని గూగుల్ డీప్మైండ్ అంచనా వేసింది. ఇది మానవ జాతిని శాశ్వతంగా నాశనం చేస్తుందని ఓ నివేదికలో పేర్కొంది. అయితే ఈ సామర్థ్యాన్ని ఏఐ ఎలా సాధిస్తుందన్న విషయాన్ని వెల్లడించలేదు. AGI ముప్పును నియంత్రించడానికి గూగుల్తో పాటు ఇతర ఏఐ కంపెనీలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నివేదిక ఫోకస్ పెట్టింది.
గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని IPL-2025లో SRHపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారి కప్పు కొడుతుందని ధీమాగా ఉండగా ఆరెంజ్ ఆర్మీ ప్రదర్శన మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి మ్యాచ్ మినహా మిగతా వాటిలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. భారీ స్కోర్లు అటుంచి కనీసం మ్యాచ్ గెలిచే ప్రదర్శన చేయలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా సమష్టిగా రాణిస్తే అంచనాలను అందుకోవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత స్టాక్ మార్కెట్లు 3.9%, హాంకాంగ్- 8.7%, సింగపూర్- 7%, జపాన్- 6%, చైనా- 5.5%, మలేషియా- 4.2%, ఆస్ట్రేలియా- 4.1%, ఫిలిప్పీన్స్- 4%, న్యూజిలాండ్-3.6% నష్టపోయాయి. కొన్ని నెలల పాటు ఈ టారిఫ్స్ ఒడుదొడుకులు కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.
రెమ్యునరేషన్ వివరాలు వెల్లడించాలని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్కు ఐటీ నోటీసులు రావడంపై ఆయన తల్లి మల్లిక స్పందించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తునకు భయపడేది లేదని చెప్పారు. అంతకుముందు సినిమా విషయంలో వివాదం చెలరేగగా పృథ్వీరాజ్కు స్టార్ హీరో మమ్ముట్టి అండగా ఉండటం తనను కదిలించిందని తెలిపారు. తన కొడుకుకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.