India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రంప్ తమపై విధించిన సుంకాలకు ప్రతీకారంగా చైనా కూడా 34శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. దానిపై ట్రంప్ స్పందించారు. ‘వారు మాపై సుంకాలు విధించలేరు. అది వారికి మంచిదికాదు. కానీ టెన్షన్ పడ్డారు. తప్పటడుగు వేశారు’ అని తన ట్రూత్ సోషల్లో వ్యాఖ్యానించారు. సుంకాలతో పాటు అరుదైన వనరుల ఎగుమతులపై, రక్షణ రంగ సంబంధితమైన 30 అమెరికా కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది.
గత నెల 30న రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో గాయపడిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రేపు ఢిల్లీతో మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
AP: బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, లెప్టోస్పీరోసిస్ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకి ఇటీవల ఓ బాలిక మృతి చెందిందని చెప్పారు. దీనిపై ICMR బృందం అధ్యయనం చేసిందన్నారు. కాగా ఆ బృందంతో సీఎం ఇవాళ సమీక్షించారు.
ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 25 నుంచి మే 24 వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసినవారు అర్హులు. జీతం రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వయసు 27 ఏళ్లు కాగా రిజర్వేషన్ల మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <
AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 7, 8, 9, 10, ఇంటర్ సెకండియర్లో మిగిలిన సీట్లకు అప్లై చేసుకోవాలని సమగ్రశిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. అనాథలు, డ్రాపౌట్స్, SC, ST, BC, మైనార్టీ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వెబ్సైట్: https://apkgbv.apcfss.in/
గత ఆర్థిక సంవత్సరం ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన వెహికిల్గా మారుతీ సుజుకీ వేగన్-R నిలిచింది. 1,98,451 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మెుత్తం 33.7 లక్షల యూనిట్లు సేల్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆటో మెుబైల్ మార్కెట్లో Wagon-R 4th జెనరేషన్ వెహికిల్ 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
అలోవేరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి 14 ఏళ్ల బాలిక మరణించింది. బెంగళూరుకు చెందిన దీపాంజలికి అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్ తీసుకొని తాగేసింది. అయితే అంతకుముందే అందులో జ్యూస్ అయిపోవడంతో పేరెంట్స్ ఆ డబ్బాలో పురుగుల మందు లిక్విడ్ పోసి పెట్టారు. అది గమనించకపోవడంతో దీపాంజలి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీని ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘కూలీ ఫ్రమ్ ఆగస్టు 14’ అన్న హాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్, పూజా హెగ్డే తదితరులు నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన మహాకుంభమేళా నుంచి సేకరించిన పవిత్ర గంగా జలాలను యూపీ ప్రభుత్వం విదేశాలకు పంపుతోంది. మొదటగా మహా ప్రసాదం పేరుతో వెయ్యి బాటిళ్లను(ఒక్కోటి 250ml) జర్మనీలోని భక్తులకు ఎగుమతి చేసింది. ఇప్పటికే UPలోని 75 జిల్లాలతోపాటు దేశవ్యాప్తంగా 50వేల బాటిళ్లను సరఫరా చేసినట్లు తెలిపింది. కుంభమేళాకు హాజరుకాలేకపోయిన వారికి జలాలను పంపి ఈ మహావేడుకలో భాగం చేస్తున్నట్లు పేర్కొంది.
LSGతో మ్యాచ్లో MI టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నారు. మోకాలి గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమయ్యారు. అతడి స్థానంలో రాజ్ అంగద్ బవ MI తరఫున అరంగేట్రం చేశారు.
LSG: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, మిల్లర్, బదోని, సమద్, దిగ్వేశ్, శార్దూల్, అవేశ్, ఆకాశ్దీప్
MI: జాక్స్, రికెల్టన్, సూర్య, నమన్ ధిర్, పాండ్య, రాజ్అంగద్, శాంట్నర్, దీపక్, బౌల్ట్, విఘ్నేశ్, అశ్వనీ కుమార్
Sorry, no posts matched your criteria.