India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో <<15964152>>తొలి మరణం<<>> సంభవించడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ, ముంబై, మంగళగిరి ఎయిమ్స్కు చెందిన పలువురు డాక్టర్లతో కలిసి అధ్యయనం చేయిస్తోంది. నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి ఎప్పుడు అనారోగ్యానికి గురైంది? ఎప్పుడు ఆస్పత్రిలో చేరింది? వైద్యులు ఎలాంటి చికిత్స అందించారు? అనే వివరాలను ఆ బృందం ఆరా తీసింది. చిన్నారి కుటుంబీకులు చికెన్ కొనుగోలు చేసిన దుకాణంలో శాంపిల్స్ సేకరించింది.
తమిళనాడు ప్రభుత్వానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షాక్ ఇచ్చారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలన్న బిల్లును తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు అసెంబ్లీ గతేడాది జూన్లో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.
AP: చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ నేల చూపులు చూస్తోందని వైసీపీ విమర్శించింది. ‘జగన్ హయాంతో పోలిస్తే నేడు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 2023-24లో రూ.9,600కోట్లు రాగా, 2024-25లో రూ.8,800కోట్లకు పడిపోయింది. అది రాబట్టడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు’ అని ట్వీట్ చేసింది.
మాధవన్, సిద్ధార్థ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ‘టెస్ట్’ సినిమా OTTలో విడుదలైంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్.శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. చెన్నైలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఎలా మార్చిందనే స్టోరీ లైన్తో ఈ స్పోర్ట్ డ్రామా రూపొందింది.
TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని BRS నేత రాకేశ్ రెడ్డి ఆరోపించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల్లో 40% మంది తెలుగు మీడియం వారు ఉన్నారు. వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకర్లలో లేరు. మొత్తం 46 సెంటర్లలో పరీక్షలు జరగగా, కేవలం 2 సెంటర్ల నుంచే 72 మంది టాపర్లున్నారు. 25 సెంటర్ల నుంచి ఒక్కరికీ టాప్ ర్యాంక్ రాలేదు. ఇదెలా సాధ్యం’ అని ప్రశ్నించారు. 18, 19వ సెంటర్లలో ఏదో గోల్ మాల్ జరిగిందన్నారు.
SRH కెప్టెన్ కమిన్స్ IPL చరిత్రలో ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. నిన్న KKR మ్యాచ్తో సహా 7సార్లు 50+ పరుగులు ఇచ్చిన బౌలర్గా మోహిత్శర్మతో పాటు టాప్లో నిలిచారు. మరోవైపు, ఈ లిస్టులో సునీల్ నరైన్ చిట్టచివర ఉన్నారు. 14ఏళ్లుగా లీగ్ ఆడుతూ ఒక్కసారి కూడా 50+ రన్స్ ఇవ్వలేదంటే ఎంత ఎఫెక్టివ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇన్నేళ్లుగా అతని బౌలింగ్ను డీకోడ్ చేయలేకపోవడం గొప్ప విషయమని ఫ్యాన్స్ అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. కోత దశలో ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న, ఇతర పంటలు నాశనమయ్యాయి. కల్లాలు, మార్కెట్ యార్డుల్లో ఉన్న మిర్చి తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు ఇది పెద్ద దెబ్బే. కూరగాయలతోపాటు మామిడి, అరటి తదితర ఉద్యానవన పంటలు నేలకూలాయి. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’తో పాపులరైన సౌత్ కొరియన్ నటుడు ఓ యోంగ్ సు(80)కు కోర్టు ఏడాది పాటు జైలుశిక్ష విధించింది. ఓ జూనియర్ ఆర్టిస్టును అతడు లైంగికంగా వేధించడమే ఇందుకు కారణం. అయితే ఇందులో తన తప్పు లేదని యోంగ్ సు కోర్టులో చెప్పారు. కానీ ఇరుపక్షాల వాదనలు విని, సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 50 ఏళ్లుగా ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే 2 గంటల్లో తూర్పు, దక్షిణ తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విశ్లేషకులు అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పేరెంట్స్లో ఒకరు ట్రైబల్ కాదనే కారణంతో పిల్లలకు ST సర్టిఫికెట్ నిరాకరించడం తగదని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఓ నీట్ అభ్యర్థి ST సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు. తల్లి ట్రైబల్ కాగా తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తని అధికారులు అర్జీని తిరస్కరించారు. దీనిపై అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 24గంటల్లో సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.