News April 4, 2025
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు: BRS నేత

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని BRS నేత రాకేశ్ రెడ్డి ఆరోపించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల్లో 40% మంది తెలుగు మీడియం వారు ఉన్నారు. వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకర్లలో లేరు. మొత్తం 46 సెంటర్లలో పరీక్షలు జరగగా, కేవలం 2 సెంటర్ల నుంచే 72 మంది టాపర్లున్నారు. 25 సెంటర్ల నుంచి ఒక్కరికీ టాప్ ర్యాంక్ రాలేదు. ఇదెలా సాధ్యం’ అని ప్రశ్నించారు. 18, 19వ సెంటర్లలో ఏదో గోల్ మాల్ జరిగిందన్నారు.
Similar News
News July 6, 2025
జులై 6: చరిత్రలో ఈరోజు

1901: భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జననం
1930: ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం(ఫొటోలో)
1985: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ జన్మదినం
1986: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం మరణం
2002: వ్యాపారవేత్త ధీరుభాయ్ అంబానీ మరణం
News July 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 6, 2025
జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

AP: సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రంలోని జడ్జీలందరికీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘SM పోస్టుల కేసుల్లో ఆర్నేష్ కుమార్ Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు తీర్పులో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడంలేదు. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ(3-ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో)పై FIRలు నమోదుకు ముందు కచ్చితంగా విచారణ జరగాలి. 14 రోజుల్లోగా విచారణ చేయాలి, అందుకు DSP అనుమతి పొందాలి’ అని స్పష్టం చేసింది.