News December 31, 2024
ఒంట్లో సగటు ఉష్ణోగ్రత 98.6F డిగ్రీలు కాదు: స్టడీ
థర్మా మీటర్లో 98.6F డిగ్రీల వేడి దాటేసిందంటే జ్వరమొచ్చిందని భావిస్తాం. నిజానికి మనమంతా అనుకుంటున్న ఈ సగటు ఉష్ణోగ్రత కరెక్టు కాదని స్టాన్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు అంటున్నారు. 2008-17 మధ్య వేర్వేరు వయసు, ఎత్తు, బరువు, లింగభేదం, BMI ఉన్న 6.18L మందిని Dr జూలీ పర్సోనెంట్ బృందం పరిశీలించింది. వారిలో సాధారణ టెంపరేచర్ 97.3 – 98.2°F మధ్యే ఉన్నట్టు గుర్తించింది. మారిన పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది.
Similar News
News January 25, 2025
స్టైలిష్ లుక్లో రవితేజ.. రేపు గ్లింప్స్
మాస్ మహారాజా రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి రేపు ఉ.11.07 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆయన స్టైలిష్గా కనిపిస్తున్నారు. బాను బోగవరపు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు.
News January 25, 2025
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.
News January 25, 2025
మహాత్మాగాంధీకి ఇండోనేషియా అధ్యక్షుడి నివాళులు
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఆ దేశంతో భారత దౌత్యబంధం మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ప్రబోవోను భారత సర్కారు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత్కు చేరుకున్న ఆయన, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.