News December 2, 2024
అయోధ్య లాంటి ఉద్యమం చేయాలి: కర్ణాటక MLA

కర్ణాటక బీదర్ జిల్లాలో అనుభవ మంటపం పునర్నిర్మాణానికి అయోధ్య లాంటి ఉద్యమం చేపట్టాలని విజయపుర MLA బసనగౌడ పాటిల్ పిలుపునిచ్చారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ మంటపం ఉన్న స్థానంలో ముస్లిం సాధువు దర్గా పీర్ పాషా బంగ్లాను ఏర్పాటు చేశారన్నారు. త్వరలోనే ఉద్యమం ప్రారంభించి, మంటపం తిరిగి అదే స్థలంలో నిర్మించే వరకు పోరాటం ఆగదన్నారు. వివిధ లింగాయత్ మఠాల మఠాధిపతులు పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
Similar News
News November 28, 2025
SNBNCBSలో ఫ్యాకల్టీ పోస్టులు

సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ (SNBNCBS) ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్డీ(అప్లైడ్ సైన్స్/ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం ఉండాలి. జీతం అసిస్టెంట్ ప్రొఫెసర్కు నెలకు రూ.78,800, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.1,23,100 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.bose.res.in/
News November 28, 2025
టాక్సిక్ వర్క్ కల్చర్లో పనిచేస్తున్నా:గర్భిణి ఆవేదన

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కొందరు మేనేజర్లు ఇబ్బందిపెడుతుంటారు. అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్లో ఇబ్బందిపడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని చేసిన రెడిట్ పోస్ట్ వైరలవుతోంది. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యానని,103°F జ్వరంలోనూ మేనేజర్ సెలవు నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీవ్ అడిగితే ఫోన్ చేసి తిట్టారని ఆమె ఆరోపించారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది.
News November 28, 2025
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP: రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రికి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి మరింత ఆర్థిక సాయం అందించాలని కోరారు.


