News April 25, 2024
ఫ్రస్ట్రేషన్లో బాబు, పవన్: సజ్జల

AP: TDP చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ తాపత్రయపడుతున్నారు. ఆయన ఆడుతున్న నాటకంలో పవన్ ఓ పాత్రధారి. కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. కాపుల ఓట్లు గంపగుత్తగా టీడీపీకి వేయించేందుకు పవన్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. బాబుకు పవన్ ఎందుకు లొంగిపోయారో చెప్పాలి’ అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News March 13, 2026
ఈనెల 18 నుంచి పెళ్లిళ్లు.. గ్యాస్ కొరతపై ఆందోళన

ఈనెల 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ కొరత ప్రభావం పెళ్లి భోజనాలపై పడనుంది. ఫంక్షన్లకు పెద్ద ఎత్తున వంటలు చేసే క్యాటరింగ్ నిర్వాహకులు గ్యాస్ స్టవ్లను ఉపయోగిస్తుంటారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వంటలు ఎలా చేయాలనే ఆందోళన మొదలైంది. ఇక కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టెలకూ డిమాండ్ పెరుగుతుండడంతో వివాహాలు చేసే కుటుంబాలపై మరింత భారం పడనుంది.
News March 13, 2026
పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. సన్రైజర్స్కు షాక్!

‘The Hundred’ టోర్నీకి <<19366541>>పాక్<<>> ఆటగాడు అబ్రార్ను కొని విమర్శలు ఎదుర్కొంటున్న సన్రైజర్స్ ఫ్రాంచైజీకి మరో షాక్ తగిలింది. సన్రైజర్స్ లీడ్స్ X అకౌంట్ సస్పెండ్ అయింది. రూల్స్ ఉల్లంఘించిన అకౌంట్లను X సస్పెండ్ చేస్తుందని ఆ పేజ్లో ఉంది. యూజర్లు రిపోర్ట్ చేయడం ఓ కారణంగా తెలుస్తోంది. ఫ్రాంచైజ్ ఓనర్ కావ్యా మారన్పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ఐపీఎల్లో SRH మ్యాచ్లు బాయ్కాట్ చేయాలని SMలో ట్రెండ్ చేస్తున్నారు.
News March 13, 2026
పచ్చి ఆకు ఎరువుతో కలిగే ప్రయోజనాలు

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.


